S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/13/2018 - 01:38

అమరావతి, సెప్టెంబర్ 12: వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో మన దేశం తరఫున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అందింది. మూడురోజుల పాటు 11 ముఖ్య సమావేశాలకు ఆయన హాజరై నవ్యాంధ్రలో పెట్టుబడులకు అనువైన పరిస్థితుల గురించి వివరించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం బోర్డ్ మెంబర్స్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

09/13/2018 - 04:53

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంచనకు మారుపేరని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విశాఖలో బుధవారం జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ పదవికోసం ఎంత నీచానికైనా వెనుకాడని మనస్తత్వం ఆయన సొంతమన్నారు.

09/13/2018 - 01:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)ను జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తిస్తూ కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ పేరును నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతిగా మారుస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

09/13/2018 - 04:59

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఢిల్లీ, అమరావతి కేంద్రంగా ఉండే పార్టీలకు పెత్తనం కట్టబెడదామా? స్వీయ రాజకీయ అస్థిత్వ పాలన కావాలో? తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే ఆత్మగౌరవం కోసమని కేటీఆర్ గుర్తు చేసారు. టీఆర్‌ఎస్‌కు అధిష్టానం తెలంగాణ గల్లీలో ఉందన్నారు.

09/13/2018 - 06:29

హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నేత రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు జారీ చేశారు. హౌసింగ్ సొసైటీకి చెందిన భూముల వ్యవహారంలో రేవంత రెడ్డిపై సొసైటీకి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేవారు. కేసుకు సంబంధించి విచారించడానికి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు రావాలని రేవంత్‌రెడ్డికి పోలీసులు సమాచారం ఇచ్చారు.

09/13/2018 - 05:04

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరమి కొట్టాలని పీసీసీ అద్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్చర్లకు చెందిన వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

09/13/2018 - 05:03

హైదరాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కు తక్షణమే సమగ్ర నివేదిక సమర్పిస్తామని కేంద్ర ఎన్నికల అధికారుల బృందం ప్రకటించింది. సీఈసీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా నేతృత్వంలో 10 మందితో కూడిన బృందం మంగళవారం హైదరాబాద్ వచ్చింది.

09/13/2018 - 01:19

ంచిర్యాల, సెప్టెంబర్ 12: చెన్నూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్‌కు ఇవ్వడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్నికల ప్రచారానికి సుమన్ బుధవారం శ్రీకారం చుట్టి ఇందారం నుంచి ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఇందారం వద్దకు చేరుకున్న బాల్క సుమన్‌ను ఆ ప్రాంత ప్రజలు నిలువరించారు.

09/12/2018 - 12:41

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం సీఈసీ బృందం కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి కొంతమంది అధికారులు ఆలస్యంగా రావటంపై సీఎస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో పాటు ఎన్నికల సంఘం అధికారులు సైతం పాల్గొన్నారు.

09/12/2018 - 05:45

ఆలమూరు, సెప్టెంబర్ 11: ప్రకృతి వైపరీత్యాల నుండి తమ పంటలను కాపాడాలని వేడుకుంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన 160 మంది రైతులు మంగళవారం సైకిళ్లపై తిరుమల యాత్రకు బయలుదేరారు. గ్రామంలోని శ్రీ బాలవినాయక ఆలయం, శ్రీ బాల త్రిపురసుందరీ దేవి సమేత శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అన్నదాతలు అనంతరం 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా బయలుదేరి వెళ్లారు.

Pages