-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
రాయిపూర్, సెప్టెంబర్ 11: తమ వివరాలను పోలీసులకు అందిస్తూ ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్న అనుమానంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఇద్దరు గ్రామస్తులను కిడ్నాప్ చేసి హత్య చేశారు. దంతేవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ తెలిపిన వివరాల ప్రకారం ఆయుధాలు ధరించి వచ్చిన కొందరు నక్సల్స్ బచేరి పట్టణంలోని హంగాకర్మ (35), భీమాముచకి (35)లను వారం క్రితం కిడ్నాప్ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 11: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి పన్నులు వసూలుచేస్తూ వాటి హక్కులను కాలరాస్తోందని ముఖ్యమంత్రి చంద్ర బాబు ధ్వజమెత్తారు. ‘రాజధాని అమరావతి నిర్మాణం’పై మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాజధానిలో 27వేల మంది రైతు కుటుంబాలు స్వచ్ఛందంగా స్పందించి 34వేల ఎకరాలు త్యాగం చేశారని తమ ప్రభుత్వ విశ్వసనీయతే ఇందుకు నిదర్శనమన్నారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: జనవరిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణలోని ముందస్తు ఎన్నికలపై విస్తృతమైన చర్చలు జరపుతున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిస్థితులనూ సమీక్షిస్తున్నారు. మంగళవారం నాడు తనను కలవడానికి వచ్చిన నేతలతో మాట్లాడుతూ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ సమన్వయ కర్త పితాని బాలకృష్ణకు ఆంధ్రాలో తొలి టిక్కెట్ను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
జగిత్యాల, సెప్టెంబర్ 11: ఆర్టీసీ చరిత్రలోనే ఓ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న వాహనమే మృత్యుశకటంగా మారింది. తెలంగాణలోని కొడిమ్యాల మండలం శనివారంపేట ఘాట్రోడ్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో 57 మంది దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు అంజన్న దర్శనానంతరం ఉదయం 11 గంటలకు ఘాట్ రోడ్డు వద్ద బోల్తా పడింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: కుటుంబ సభ్యుల పేర్లు మార్చి పాస్పోర్టు పొందడంతోపాటు, తప్పుడు వీసాపై అమెరికా వెళ్లారన్న ఆరోపణలపై అరెస్టయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి కోర్టు బెయిల్ నిరాకరించింది. సికిందరాబాద్ కోర్టు 15 రోజుల కస్టడీ విధించింది. 2004లో సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును తప్పించి రాష్టప్రతి పాలన విధించాలని ప్రతిపక్షాల నాయకులు గవర్నర్ నరసింహన్ను కోరారు. మంగళవారం టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పి మాజీ నేత కే. జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి డీకే అరుణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: నిజాం మ్యూజియంలో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలు పోలీసులకు దొరికిపోయారు. అత్యంత విలువైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1936) కాలం నాటి వస్తువులు దోపిడీకి గురయ్యాయి. నవాబ్ పాలన రజతోత్సవం సందర్భంగా విదేశీయుల నుంచి బహుమతులుగా వచ్చిన వస్తువులను పురానా హవేలీ వద్ద నిజాం మ్యూజియంలో ఉంచారు.
హైదరాబాద్: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఓడించడమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడేందుకు సమాయత్తమవుతున్న విపక్షాల నేతలు మరోవైపు భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్నది త్వరలో నిర్ణయించనున్నారు. అంతేకాకుండా ఉమ్మడి ప్రణాళికతోనే ముందస్తుకు వెళ్లాలని విపక్షాల నేతలు భావిస్తున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: యువత ఆశయాలకు అనుగుణంగా సరికొత్త పని సంస్కృతిని పాదుకొలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు మరోవైపుప్రత్యేక చర్యలు సాగుతున్నాయన్నారు. స్వామి వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయ, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో దేశం పురోగమిస్తోందన్నారు.