S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/11/2018 - 00:19

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికీ ఆవాస కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. 2022 నాటికి 25 లక్షల ఇళ్లను నిర్మించాలనే సంకల్పంతో ఉన్నామని, ఎన్నికలలోపు18 లక్షల వరకు పూర్తి చేసి అర్హులకు అందజేస్తామన్నారు.

09/10/2018 - 13:57

అమరావతి: రాష్ట్రంలో 41 ఐటీఐలు ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ శాసనసభలో తెలిపారు. ఐటీఐల ఏర్పాటుకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పై విషయాన్ని వెల్లడించారు.

09/10/2018 - 04:26

నెల్లూరు: ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు దివంగత హాస్యనటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి స్మారక అవార్డును ఆదివారం నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు. నెల్లూరుకు చెందిన కళాంజలి సాంస్కృతిక సంస్థ ఈ ఏడాదికిగాను రమణారెడ్డి అవార్డును పృథ్వీరాజ్‌కు అందజేసింది.

09/10/2018 - 03:49

మోర్తాడ్, సెప్టెంబర్ 9: ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కవితా రచనలో ముందుకు దూసుకెళ్తున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఇప్పటికే అనేక పుస్తకాలను ఆవిష్కరింపజేసుకున్న ఇక్కడి విద్యార్థులు, తాజాగా ఆదివారం మరో కవితా సంపుటిని రచించి ప్రముఖులచే మన్ననలు పొందారు.

09/10/2018 - 03:47

భీమదేవరపల్లి, సెప్టెంబర్ 9: యువత బలాదానాల మీద పీఠమెక్కి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని.. బంగారు తెలంగాణతో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌ను ఇక తెలంగాణ ప్రజలు విశ్వసించరని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు.

09/10/2018 - 03:44

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 9: వచ్చే అక్టోబర్ 15లోపు నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ, బీటీ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం నగరంలోని గీతాభవన్ చౌరస్థాలోని కూడలిలో ప్రధాన రహదారిపై కొనసాగుతున్న బీటీ పనులు పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ శరవేగంగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

09/10/2018 - 04:10

జగిత్యాల, సెప్టెంబర్ 9: రైతుకు పచ్చ బంగారమైన పసుపు ధర క్వింటాల్ వరకు రూ.15వేలు పొందే వరకు పోరు ఆపేది లేదని మహాపాదయాత్రలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని పసుపు రైతు మహాపాదయాత్రలో ముత్యాల మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాఅంతర్గాం గ్రామానికి పసుపు రైతు మహాపాదయాత్ర చేరుకుంది.

09/10/2018 - 03:41

నర్సంపేట, సెప్టెంబర్ 9: నర్సంపేట నియోజకవర్గంలో వివిధ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3.25కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేట పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వివిధ కుల సంఘాల పెద్దలు, పార్టీ నాయకులతో పెద్ది ఆదివారం సమావేశమయ్యారు.

09/10/2018 - 11:15

విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 9: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తీకి కొప్పరపుకవుల జాతీయ పురస్కారాన్ని ఆదివారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రదానం చేశారు. అదేవిధంగా కొప్పరపు కవుల అవధాన పురస్కారాన్ని ఈఏడాది గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్‌కు అవధాన పురస్కారాన్ని అందచేశారు.

09/10/2018 - 01:02

విజయవాడ, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జ్వరాల నియంత్రణకు రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ కమాండ్ సెంటర్‌లో (ఆర్టీజీఎస్‌లో) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్వరాలు, పారిశుద్ధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ సెంటర్‌లో ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. జ్వరాలు అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

Pages