-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైథరాబాద్, జూలై 30: జూనియర్ కాలేజీల్లో గెస్టు లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు లెక్చరర్లు, అవుట్సోర్సింగ్ లెక్చరర్లుగా నియమిస్తే రానున్న రోజుల్లో సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం కొత్త పేరుతో కాంట్రాక్టు నియామకాలకు తెరతీసింది. మూడు రోజుల్లో గెస్టు ఫ్యాకల్టీకి ఉన్న ఖాళీలను నోటిఫై చేస్తారు. అనంతరం రెండు రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తారు.
హైదరాబాద్, జూలై 30: రాష్ట్రంలో కొత్త పంచాయతీల ప్రారంభోత్సవం ఘనంగా, పండగ వాతావరణంలో నిర్వహించాలని పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 2 నుండి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటవుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తదితరులతో సోమవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 30: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలను శ్రీకారం చుట్టిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ విశ్వవిద్యాలయాలు కేవలం పరీక్షలు- సర్ట్ఫికేట్ల జారీకే పరిమితం కాకుండా లోకజ్ఞానాన్ని పెంచేవిగానూ, సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చే సంస్థలుగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సోమవారం ఉదయం రంగం కార్యక్రమం జరిగింది. అవివాహిత స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించిన రాష్ట్రప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు.
హైదరాబాద్: భారతీయ సనాతన ధర్మమే ప్రపంచానికి సరైన దారి చూపుతుందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. అమెరికాలోని మిల్పిటాస్ (కాలిఫోర్నియా) లోని శ్రీ రమాసత్యనారాయస్వామి ఆలయంలో ప్రముఖ వేదపండితులు, జ్యోతిష్యులైన మారేపల్లి నాగవేంకట శాస్ర్తీకి శనివారం రాత్రి సన్మానం జరిగింది. కాలిఫోర్నియాలో ఉన్న తెలుగువారంతా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జగ్గంపేట, జూలై 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం కొనసాగింది. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట నుండి ఆదివారం ఉదయం ప్రారంభమైన యాత్ర సాయంత్రం కిర్లంపూడి మండలం వీరవరంలో ముగిసింది.
హైదరాబాద్, జూలై 29: నానాటికి అంతరించి పోతున్న సీతాఫలానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కారచరణ సిద్ధం చేస్తోంది. నోరూరించే రుచితో పాటు ఎన్నో పోషక విలువలు సీతఫలం స్వంతం. గతంలో తెలంగాణలోని అడవుల్లో విపరీతంగా లభించిన పండ్లు ప్రస్తుతం కనుమరగయ్యే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్, జూలై 29: డాక్టరేట్లు పొందిన వ్యక్తులు వాటి ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. వైద్యవృత్తిని చదివిన వారికి కోర్స్ పూర్తి అయితే డాక్టర్ అవుతారు కానీ అదే ఏదైనా రంగంలో డాక్టరేట్ పొందాలంటే దశాబ్దాల పాటు కష్టపడాల్సి ఉంటుందన్నారు. డాక్టరేట్ రావడం ఆషామాషీ కాదని, అది రావడానికి వెనుక ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్నారు.
హైదరాబాద్: సినిమా థియేటర్లలో తినుబండారాలపై, వాటర్ బాటిళ్ళపై ఉండే ఎంఆర్పి ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 29: ఇక నుంచి రియలెస్టేట్ వ్యాపారాలు, వాటికి సంబంధించిన ఏజెంట్లు తప్పనిసరిగా రేరా (రియలెస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)లో రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన నియమనిబంధనలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. అపార్ట్మెంట్లు, స్థలాలు క్రయవిక్రయాల్లో మోసపోకుండా ఉండడానికి రేరాను ఆశ్రయించవచ్చును.