-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విశాఖపట్నం, మార్చి 2: అఖిల భారత మేజర్ పోర్టుల క్రికెట్ పోటీలు విశాఖ పోర్టు స్టేడియంలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విశాఖపోర్టు ట్రస్టు (వీపీటీ) చైర్మన్ రామ్మోహన రావు పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 10 మేజర్ పోర్టుల నుంచి క్రికెట్ జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. తొలి మ్యాచ్ వీపీటీ, చెన్నై పోర్టుల మధ్య జరుగగా, వీపీటీ విజయం సాధించింది.
ఆళ్లగడ్డ, మార్చి 2: దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామికి బెంగళూరుకు చెందిన భక్తుడు ప్రశాంత్ అయ్యంగార్ సోమవారం వజ్ర కిరీటం అందజేశారు. అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రహ్లాద కైంకర్యసభ సభ్యులు ప్రశాంత్ అయ్యంగార్ రూ. 2 లక్షల విలువ చేసే వజ్రకిరీటాన్ని మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామికి అందజేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 రిక్రూట్మెంట్లో తొలి జాబితాలో మిగిలిపోయిన కొన్ని పోస్టులకు ఈనెల 7 నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ పేర్కొంది. పోస్టు కోడ్-12 ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పోస్టు కోడ్-13 న్యాయశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు మూ డో జాబితాను రూపొందించినట్టు కమిషన్ తెలిపింది. వీరికి ఈనెల 7 నుండి ఇంటర్వ్యూలు జరుగుతాయి.
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు ఆదివారం ఉదయం వటపత్రశాయి ఆలంకార సేవలో, రాత్రి పొన్నవాహన విహారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రళయకాలంలో జగత్తును కాపాడేందుకు మర్రి ఆకుపై పవళించి తన గర్భంలోని లోకాలన్నంటికీ పాదారవిందం చేత నోటి ద్వారా అమృతమును అందిస్తూ జగద్రక్షుడైన స్వామివారు చిన్నికృష్ణుడి రూపంలో వటపత్ర శయనుడిగా అవతరించి లోకాలను రక్షించారు.
హైదరాబాద్/నల్లకుంట, మార్చి 1: కథకు వస్తువు దొరకనంతగా తెలుగువారి జీవితం సంక్లిష్టమైపొయిందని ప్రముఖ సినీ, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తీ అన్నారు. సంతానానికి పేర్లు పెట్టడం దగ్గర నుంచి మనుషుల మధ్య బంధాల వరకు వాతవరణం అంత కృతకంగా మారిపొయిందని పేర్కొన్నారు.
అమరావతి, మార్చి 1: ఆర్టీసీ అభివృద్ధి, బలోపేతం దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు డిపోలను ఇంధన సామర్థ్య బస్స్టేషన్లుగా ఆధునీకరించటంతో పాటు వైఫై సౌకర్యం, ఇంధన సామర్థ్య ఎల్ఈడీ లైటింగ్, ఆధునిక టాయిలెట్ల ఏర్పాటుతో రూపురేఖలు మార్చే యోచనలో ఉంది.
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఎగువ అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా నిత్య హోమం, సోమ కుంభస్థాపన, పాళికావాహనం, గరుడప్రతిష్ఠ, షోడప కలశ స్థాపన, ధ్వజ పటానికి పూజలు చేసిన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం చేపట్టారు.
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషాలంకార, వాహన సేవల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం లక్ష్మీనరసింహుడు మురళీకృష్ణావతారం అలంకార సేవలో హంసవాహనంపై విహరించి భక్తులను తరింపచేశారు.
తిరుపతి: 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను 3,309.89 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శార్వరి నామ సంవత్సర తెలుగు పంచాంగాన్ని చైర్మన్ ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు.
విజయవాడ: విద్యుత్ వినియోగదారుల నుంచి ఇక నిర్ణీత కాల వ్యవధిలోనే నయాపైసాతో సహా బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టబోతున్నది. ఇందులో భాగంగా దశల వారీగా ప్రతి విద్యుత్ కనెక్షన్కు స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చాలని యోచిస్తున్నది. నిర్ణీత కాల వ్యవధిలో బిల్లు చెల్లించని పక్షంలో తక్షణమే ఆ కనెక్షన్కు ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.