-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్ నగరం నుండి పోలీసులు తనను బహిష్కరించడాన్ని నిరసిస్తూ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయాన్ని సవాలుచేస్తూ పరిపూర్ణానంద బుధవారం నాడు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీసు శాఖ విస్మరిస్తోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, జూలై 11: శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందకు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సందర్భాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అవి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నందున చట్ట ప్రకారం నగర బహిష్కరణ చేసినట్లు నగర పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై 11: స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
హైదరాబాద్, జూలై 11: ఎమ్సెట్ పేపర్ లీక్ వ్యవహారంలో సిఐడీ అధికారులు తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. లీక్ వ్యవహారంలో వాసుబాబులు చాలా మంది ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగాక, వాసుబాబు 2016 పేపర్తో పాటు అంతకు ముందు జరిగిన ఎమ్సెట్ పేపర్లను సైతం లీక్ చేశారా అనే అంశాన్ని కూడా విచారిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 11: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు చిత్తశుద్ధి లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకే కోర్టులు మొట్టికాయలు వేశాయని ఆయన బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.
హైదరాబాద్, జూలై 11: పంచాయతీ ఎన్నికల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు 61 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో మార్పులేదని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళతామని ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూడాలంటూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో బుధవారం వివరంగా చర్చించింది.
విజయవాడ: రాష్ట్ర ప్రధాన పరిపాలన, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా గౌతం సవాంగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఆర్టీసీ బస్భవన్లోని విజిలెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు ఆ విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోన్న హోంశాఖ కార్యదర్శి అనురాధ నుంచి ఈ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్ కార్యాలయాన్ని పరిశీలించారు.
విజయవాడ: నాణ్యమైన భోజనాన్ని ఐదు రూపాయలకు అందించటమే అన్న క్యాంటీన్ల లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన బుధవారం విజయవాడలో అన్నక్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతి క్యాంటీన్ వద్ద 300 మందికి భోజనాలు అందించే ఏర్పాట్లు చేశామని అన్నారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేశారు.
హైదరాబాద్: పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించటం ప్రభుత్వ కుట్ర అని బీజేపీ రాక్షష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోట్లాదిమంది ఆరాధించే శ్రీరాముడిని నిందించినవారిపై చర్య తీసుకోని ఈ ప్రభుత్వం ఎవరి చేతుల్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హిందూ దేవుళ్లను తులనాడే ఎంఐఎం నేతలను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతపురం:కేంద్ర వివక్షతను నిరసిస్తూ తెలుగుదేశం ఎంపీలు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో దీక్ష ప్రారంభించారు. కరవు నేలపై కేంద్రం వివక్ష పేరుతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఎంపీలు పాల్గొన్నారు.