S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/29/2018 - 00:10

శ్రీకాకుళం, జూన్ 28: రైతన్న కలలను సాకారం చేస్తూ వారికి సిరులు కురిపించే ఏరువాకను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారంనాడిక్కడ ప్రారంభించారు. ఎడ్లతో నాగలిపట్టి దుక్కిదున్ని..విత్తనాలు, ఎరువులు వేసి యాంత్రీకరణ విధానంతో నాట్లు వేసి ఏరువాక ఇక్కడ ప్రారంభించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. చంద్రన్న రైతు బీమా పథకాన్ని ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.

06/29/2018 - 00:06

విజయవాడ, జూన్ 28: బెజవాడ కనకదుర్గమ్మ మొక్కును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీర్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని మొక్కుకున్న కేసీఆర్ గురువారం మధ్యాహ్నం భక్తిప్రపత్తులతో కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించి తన మొక్కుబడి తీర్చుకున్నారు.

06/28/2018 - 23:28

విశాఖపట్నం, జూన్ 28: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా నిర్వీర్యమైపోయిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినా, ఆ నేరాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మోయాల్సి వచ్చింది. ఆ కోపాన్ని 2014 ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీపై చూపించారు. రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా రాకుండా చేశారు.

06/29/2018 - 05:04

కడప: కడప ఉక్కు కోసం నిరాహార దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ గురువారం సాయంత్రం ఫోన్ చేసి పరామర్శించారు. ఉక్కు పరిశ్రమ ముగిసిన అధ్యాయం కాదని, ముందు దీక్ష విరమించాలని బీరేంద్రసింగ్ కోరారు. దీనికి సీఎం రమేష్ ఉద్వేగంగా స్పందిస్తూ ‘మీరు ఇక్కడికి వచ్చి ఉక్కు పరిశ్రమపై ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తా’నని సమాధానమిచ్చారు.

06/28/2018 - 16:02

హైదరాబాద్: మాదాపూర్‌లోని మీలాంజ్ టవర్‌లో ఉన్న ప్రైమ్ ఎరా అనే కంపెనీలో శ్రావణి(27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. ఇవాళ ఉదయం ఆఫీసుకు చేరుకున్న శ్రావణి తన ఆఫీస్ 9వ అంతస్థుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది. దీంతో శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

06/28/2018 - 13:47

అనంతపురం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బస చేసిన ఆర్‌అండ్‌బి గెస్ట్‌‌‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం గెస్ట్‌హౌస్‌లో కన్నా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. గెస్ట్‌హౌస్ లోనికి దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు.

06/28/2018 - 13:41

విజయవాడ: కనక దుర్గమ్మకు తెలగాణ సీఎం కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముక్కు పుడక సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దుర్గమ్మకు ముక్కు పుడక సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.

06/28/2018 - 13:26

కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై రెండు ఆస్తిపంజరాలను పోలీసులు గుర్తించారు. ఆధారాలను బట్టి వీరు నిజామాబాద్‌ జిల్లా కమ్మరిపల్లికి చెందిన పెద్దండి ప్రశాంత్‌, గౌతమిగా నిర్ధారించారు. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవటంతో వీరిద్దరూ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు.

06/28/2018 - 13:01

హైదరాబాద్ : ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెంలో తల్లిని.. తనయుడే గొంతు నులిమి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. తల్లి మమత(39) చేసిన చిట్టీల వ్యాపారంలో నష్టాలు వచ్చాయనే ఆగ్రహంతో కుమారుడు మదన్(22) ఆమెను హత్య చేశాడు. తల్లిని హత్య చేసిన అనంతరం పోలీసుల ఎదుట మదన్ లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

06/28/2018 - 12:39

హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 97వ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద ఆయన సమాధికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

Pages