S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/22/2018 - 04:12

విజయవాడ, మే 21: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ తనను ఏ కులం వారు విమర్శిస్తే ఆ కులం వారితోనే తిట్టిస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆలయాల్లో జరిగే అన్యాయాలపై నోరు మాట్లాడే హక్కు అర్చకులకు ఉందన్నారు.

05/22/2018 - 03:15

కాకినాడ, మే 21 చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి రాష్ట్రేతర ప్రాంతాలకు తరలిస్తున్న బీహార్ గ్యాంగ్ మకాంవేసినట్టు జరుగుతున్న ప్రచారంపై తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగుతోంది. కిడ్నాపర్లు పెద్ద ఎత్తున రాష్టంలోకి దిగారని, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా సంచరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులూ అప్రమత్తమయ్యారు.

05/22/2018 - 03:13

పలాస, మే 21: బీల ఉద్యమానికి జనసేన పార్టీ చివరివరకు అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ బీల ఉద్యమకారులకు భరోసా ఇచ్చారు. బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఇచ్ఛాపురం నుంచి సోంపేట మీదుగా బీలకు చేరుకొని బీలలో ఏర్పాటు చేసిన అమరుల స్థూపం వద్ద ఉద్వేగభరితంగా ప్రసంగించారు. శ్రీకాకుళం జిల్లా, సోంపేట బీలలో థర్మల్ జీవోను రద్దు చేసి ఆక్వా పరిశ్రమల పేరుతో కొత్తగా చెరువుల తవ్వకాలను ఆయన దుయ్యబట్టారు.

05/22/2018 - 03:11

విజయవాడ, మే 21: ప్రజా సంతృప్తి 90 శాతానికి పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హాయ్ చంద్రన్న యాప్‌ను త్వరలో అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయిని పెంచేందుకు ఇప్పటికే రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

05/22/2018 - 04:01

బాలాసోర్ (ఒడిశా), మే 21: భారత్-రష్యా సంయుక్త ప్రాజెక్టుగా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఓడిశా తీరం నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. చండీపూర్‌కు సమీపంలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ ప్యాడ్ 3 నుంచి సోమవారం ఉదయం 10.40 సమయంలో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు భారత రక్షణ పరిశోధన అధికారులు వెల్లడించారు.

05/22/2018 - 02:41

హైదరాబాద్, మే 21: కర్నాటకలో తలెత్తిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్టప్రతి పాలన విధించడమే సరైన నిర్ణయమని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కర్నాటకలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే మెజారిటీ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్టప్రతి పాలన విధించడమే సరైన నిర్ణయం’ అన్నారు.

05/22/2018 - 02:24

హైదరాబాద్, మే 21: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సంక్షోభం దిశగా పయనిస్తోందా? రోజురోజుకీ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం చాలావరకు అందినా ఏమాత్రం ఉపశమనం పొందలేకపోయింది. దీంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రానున్న రోజుల్లో ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది.

05/22/2018 - 02:22

హైదరాబాద్, మే 21: కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి బుధవారం చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బెంగళూరు వెళ్తారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు కూడా వెళ్లనున్నారు.

05/22/2018 - 03:44

హైదరాబాద్, మే 21: సింగరేణికి అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్) స్వాధీనానికి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

05/22/2018 - 03:46

విజయవాడ, మే 21: ప్రఖ్యాత నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (79) అమెరికాలోని కాలిఫోర్నియాలో తన కుమార్తె నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఆమె నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు అక్కడే జరుగుతాయని కుమార్తె శైలజ వెల్లడించారు.

Pages