-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, మే 17: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీ మేరకు డీఏ (కరువు భత్యం) పెంచుతూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు పెంచిన పెన్షనర్లకు కూడా వర్తిస్తుందని ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీయే జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజా పోరాట యాత్ర ప్రారంభించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి విశాఖ నగరానికి చేరుకున్నారు. గురువారం ఉదయం పార్టీ కోర్ కమిటీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ తరువాత ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ద్వారకాతిరుమల: రాష్ట్ర ప్రజల్లో భవిష్యత్తు స్ఫూర్తిని రగిలిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేబట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగో రోజైన గురువారం ఉత్సాహభరితంగా సాగింది.
కందుకూరు, మే 17: కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
పోలవరం: ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలవరం మండలం వాడపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం సంభవించిన లాంచీ ప్రమాదానికి సంబంధించి గురువారం కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. దీనితో మరో నాలుగు మృతదేహాలు లభించాయి. వీరిని కణుతుల చిరంజీవి (35), చిడుగూరి సుబ్బలక్ష్మి (22), కొండ్ల రాజారెడ్డి (65), నడిపూడి అక్కమ్మ (33) గా గుర్తించారు. దీనితో మొత్తం 19 మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు.
హైదాబాద్, మే 17: హైకోర్టు బార్ కౌన్సిల్కు జరగనున్న ఎన్నికలకు గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తెలంగాణా బార్ కౌన్సిల్కు సంబంధించి ఏడు నామినేషన్లు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు 2 నామినేషన్లు దాఖ లు అయినట్లు హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ రేణుకా తెలిపా రు. వచ్చే నెల 29న బార్ కౌన్సి ల్ ఎన్నికకు పోలింగ్ నిర్వహించనున్నారు. 17 నుంచి 26 వర కు నామినేషన్లు చేయవచ్చును.
హైదరాబాద్ : దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో హైదరాబాద్ లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. గ్రేటర్ పరిధిలోని బంజారాహిల్స్ తోపాటు రాంనగర్, ఓయూ, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కుండబోత వర్షం కురిసింది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
రాజన్న సిరిసిల్ల: వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకే సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్లో మంత్రి కేటీఆర్ రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్గౌడ్ తెలిపారు. జూన్ 8న ఉదయం 9.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9.30 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం సాయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
హైదరాబాద్: దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లుల నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది.