-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
విజయవాడ, మార్చి 8: రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, లాభసాటిగా మార్చేందుకు వీలుగా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 19070 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రైతే ముందు అన్న నినాదంతో సాగు ఖర్చులు తగ్గించేందుకు, దిగుబడులు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ను రూపకల్పన చేసింది.
అభివృద్ధి.. సంక్షేమాల సమతుల్యంగా రూ.1,91063.61 కోట్లతో రూపొందించిన 2018-19 వార్షిక బడ్జెట్ను గురువారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసన సభలో ప్రవేశపెట్టారు. సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గతంలోకంటే కేటాయింపులు పెంచుతూ అంచనా బడ్జెట్కు రూపకల్పన జరిగింది. ఇందులో రూ.1,50,270.99 కోట్లు రెవెన్యూ వ్యయంకాగా రూ.2,18,678.49 కోట్ల మూలధన వ్యయాన్ని అంచనా వేశారు.
హైదరాబాద్, మార్చి 8: దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఉద్యోగం యువతులు వత్తిడి తట్టుకోలేకక ధూమపానానికి అలవాటు పడుతున్నారని, ఈ సంఖ్య పెరుగుతోందని అసోచామ్ సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా అహమ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్కొత్తా, లక్నో, ముంబాయి, పూణే తదితర నగరాల్లో ఈ సర్వేను అసోచామ్ సామాజిక విభాగం సర్వేను నిర్వసించింది. రెండు వేల మందిని వివిధ వివరాలు అడిగారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.19,070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.18,602 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.468 కోట్లుగా ఉంది. శాసనసభలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో 25 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు.
హైదరాబాద్ : టీఎస్ఐపాస్తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట ఎయిర్పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు.
అమరావతి: రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గిపోయినా.. సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా రాష్ట్భ్రావృద్ధికి పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన శాసనసభలో ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. కేంద్రం నుంచి సకాలంలో నిధులు అందక ఇబ్బందులు పడ్డామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి యనమల ఒక లక్షా 91 వేల 063 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
అమరావతి: నాలుగేళ్ల పదవీ కాలంలో స్వేచ్చగా విధులు నిర్వర్తించానని మంత్రిగా రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారంనాడు శాసనసభలో ఆయన మాట్లాడుతూ జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకున్నాను. మంత్రి పదవి తాత్కాలికమే అని భావించి పనిచేశాను. ఇపుడు రాజీనామా చేస్తున్నా బాధపడటం లేదని అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి బిజెపి మంత్రులు వైదొలిగారు. మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారు రాజీనామా పత్రాలు సమర్పించారు.
ధర్మపురి, మార్చి 7: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.
బాసర, మార్చి 7: బాసర మండల కేంద్రంలో బుధవారం ఉదయం జంట హత్య లు కలకలంరేపింది. భైంసా నుండి నిజామాబాద్ వైపు వెళ్లే రహదారి పక్కన రైల్వేస్టేషన్కు సమీపాన స్టార్ ఇన్ రెస్టారెంట్ యజమాని రతీష్ (45), తండ్రి గోపీనాథ్ (65)లను గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి అతి కిరాతకంగా గొంతుకోసి హత్యచేశారు.