S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/20/2018 - 04:34

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేసే లక్ష్యానికి అనుగుణంగా పనులను శరవేగంగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను స్వయంగా ఈ నెల 22, 23 తేదీలలో పరిశీలించనున్నట్టు చెప్పారు. జలసౌధలో సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మంత్రి సమీక్షించారు.

02/20/2018 - 01:34

హైదరాబాద్, ఫిబ్రవరి 19: దేశంలో సాంకేతిక, విజ్ఞాన సమాచారాన్ని పరిరక్షించేందుకు కొద్దిరోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్టు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అన్ని సంస్థలూ, సంబంధీకులతో మాట్లాడేందుకు జస్టిస్ శ్రీకృష్ణ అధ్యక్షతన కమిటీని నియమించినట్టు చెప్పారు. ఈ కమిటీ నివేదిక వచ్చే నెల వస్తుందని, వెంటనే దాన్ని చట్టం చేస్తామని పేర్కొన్నారు.

02/20/2018 - 04:35

హైదరాబాద్: ఐటీ రంగంలో కొంతకాలంగా పనిచేసి, నూతన సాంకేతిక పరిజ్ఞాన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా వృత్తిలో రాణించేందుకు వీలుకల్పిస్తూ నాస్కామ్, భారత ఐటీ శాఖలు సంయుక్తంగా ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫారాన్ని ఏర్పాటు చేశాయి. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై నాస్కామ్ ప్రతినిధులు, భారత ఐటి శాఖ అధికారుల మధ్య సోమవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో సంతకాలు జరిగాయి.

02/20/2018 - 02:44

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ప్రపంచంలో పేరుగాంచిన ఐటి దిగ్గజాలు హాజరవుతున్న ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సులో కృత్రిమ మేథోసంపన్నురాలైన రోబో సోఫియా మంగళవారం నాడు ప్రసంగించనుంది. స్వీయ విచలనాలతో పనిచేస్తున్న సోఫియాకు ఇప్పటికే సౌదీ అరేబియా పౌరసత్వాన్ని కూడా అందజేసింది. సోమవారం నాడు హైటెక్స్‌లో ప్రారంభమైన ఐటి వరల్డ్ కాంగ్రెస్ 21వ తేదీ వరకూ జరగనుంది.

02/20/2018 - 01:57

హైదరాబాద్, ఫిబ్రవరి 19: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని పెడితే తాను అందర్నీ సమీకరించడానికి సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ ఇచ్చిన సవాల్‌కు పవన్ కళ్యాణ్ ప్రతిసవాల్ చేశారు. జగన్ నాకు ఛాలెంజ్ విసిరారు, నా సమాధానం ఇస్తా అంటూ పవన్ సోమవారం రాత్రి పాత్రికేయులతో మాట్లాడారు.

02/19/2018 - 13:48

హైదరాబాద్: సాంకేతికతతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1.25 బిలియన్ భారత ప్రజలకు డిజిటల్ గుర్తింపు కార్డులున్నాయన్నారు. 60 లక్షల మంది పౌరులను డిజిటల్ అక్షరాస్యులను చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు..కానీ అలా జరగలేదన్నారు.

02/19/2018 - 14:11

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఉన్న గుండు హనుమంతరావు భౌతికకాయానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

02/19/2018 - 13:32

గుంటూరు: విభజన హామీలు సవరణల ద్వారా తీసుకురావాలని...సవరణలకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష‌’లో రఘువీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల రోజులు అత్యంత కీలకమని... అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు.

02/19/2018 - 14:11

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని పోగొండ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. సోమవారం జిల్లాలో సిఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని, వాటిని త్వరగా పూర్తి చేసేందుకు దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో పూడికలు తీయిస్తామన్నారు. గొలుసుకట్టు చెరువులకు శ్రీకారం చుట్టామన్నారు.

02/19/2018 - 12:55

కృష్ణా : జిల్లాలోని వత్సవాయిలో హౌసింగ్‌ ఎఇ అప్పారావు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలలో చిక్కుకున్నారు. రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ మేరకు అప్పారావును అదుపులోకి విచారణ చేపట్టారు.

Pages