-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకునేవారికి కేంద్ర ఎన్నికల కమిషన్ మరోసారి అవకాశం కల్పించింది. దరఖాస్తులను ఈ నెల 14 వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో లేదా తహశీల్దారు కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఆర్.పి. సిసోడియా తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డు లోపలి వైపు ఉన్న అన్ని గ్రామాల్లో వచ్చే వేసవిలో తాగునీటికి కొరత లేకుండా చూస్తామని మిషన్ భగీరథ వైస్-చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులపై గురువారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఓఆర్ఆర్ ఆవల, ఈవల ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ పనులను సమాంతరంగా కొనసాగించాలన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ పార్టీని తీవ్రపదజాలంతో విమర్శించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీరామారావు, టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ, కేటీఆర్ మూర్ఖపువ్యాఖ్యలు చేశారని విమర్శించారు. రాహుల్పై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఉపసంహరించుకోవాలన్నారు. రాహుల్ టీఆర్ఎస్ నేతలా దోపిడీదారుడు కాదన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చడం లేదని ప్రశ్నించడానికి తాను ఒక్కడినే సరిపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రెండు ప్లకార్డులు ప్రదర్శించి, నాలుగు స్లోగన్లు ఇస్తే సరిపోదని, తెలంగాణ సాధనకు అన్ని పార్టీలూ కలిసి కట్టుగా ఎలా చేశాయో అదేవిధంగా ఆంధ్రాలోనూ పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
ఖమ్మం, ఫిబ్రవరి 5: మావోయిస్టులు సోమవారం తలపెట్టిన తెలంగాణ రాష్టబ్రంద్ ఉద్రిక్తతకు దారితీసింది. చత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల పరిధిలో బంద్ ప్రభావం అధికంగా కనిపించింది. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేయగా బస్సులు సైతం సరిగ్గా తిరగలేదు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి వారికి అండగా ఉంటానని జనసేన అధినేత పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల మత్స్యకారులు పవన్కళ్యాణ్ను సోమవారం కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా పవన్కళ్యాణ్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో కాలుష్యం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ ఇక పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్న ప్రభుత్వం, తర్వాత మున్సిపల్ చట్టంలోనూ మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ఆ లోగా రాష్టవ్య్రాప్తంగా కొత్త నగర పంచాయతీలు, మున్సిపాలిటీను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
అమరావతి, ఫిబ్రవరి 5: జలవనరులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన సీఎం చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. పోలవరం ప్రాజెక్టుపై నిరంతరం శ్రమిస్తున్న సీఎం, 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 5: ‘ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరుపలేదు. అయినా మన సమర్థత చూపి శాఖాపర కేటాయింపుల్లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలి’ అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సోమవారం నీరు- ప్రగతి, వ్యవసాయం పురోగతిపై జరిగిన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఏ శాఖకు ఎన్ని నిధులిచ్చే అవకాశం ఉందో అంచనాలు రూపొందించాలన్నారు.