S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/04/2018 - 01:52

హైదరాబాద్, ఫిబ్రవరి 3: నిరుద్యోగ యువకులకు శుభవార్త. అటు పోలీస్ ఉద్యోగాలు, ఇటు సాంఘిక సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రాష్ట్రంలో పోలీసు శాఖను పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా 14వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని ప్రకటించనుంది. ఉద్యోగాల భర్తీపై పూర్తి స్థాయి ఫైలు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. ఇక సీఎం కార్యాలయం ఫైలును క్లియర్ చేయడమే తరువాయ.

02/04/2018 - 01:49

హైదరాబాద్, ఫిబ్రవరి 3: చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన నగర శివారులోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో విద్యార్థి గర్జన నిర్వహించారు.

02/04/2018 - 01:47

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ప్రస్తుతం ఏర్పాటైన గ్రామ, మండల స్ధాయి సమితులకు తోడు త్వరలో జిల్లాస్థాయ రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ జిల్లా మంత్రులను ఆదేశించారు. జిల్లాస్థాయి సమన్వయ సమితి ఏర్పాటు అనంతరం కార్పొరేషన్ తరహాలో రాష్ట్ర స్థాయి సమితి ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఒక ఉన్నతాధికారిని నియమించే ఆలోచన కూడా ఉందని స్పష్టం చేశారు.

02/04/2018 - 01:42

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 3: ఏపీ నిట్‌లో ర్యాగింగ్ కలకలం రేకెత్తించింది. నిట్ కళాశాలకు చెందిన ద్వితీయ, తృతీయ సంవత్సర సీనియర్ ఆంధ్రా విద్యార్థులు మొదటి సంవత్సరానికి చెందిన బీహార్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడటంతో ఈ కలకలం రేగింది. శుక్రవారం సాయంత్రం మొదటి సంవత్సరం చదువుతున్న బీహార్‌కు చెందిన ముకుల్ కుమార్‌ను ఐదుగురు సీనియర్ విద్యార్థులతో పాటు మరికొంతమంది ర్యాగింగ్ చేసినట్టుగా సమాచారం.

02/04/2018 - 01:40

నెల్లూరు, ఫిబ్రవరి 3: నాలుగేళ్లుగా ప్రజలను వంచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నింటిలో వైఫల్యం చెంది, ప్రజలను మోసగిస్తూ ఇపుడు ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఇలాంటి దగాకోరు రాజకీయాలు చేసేవారు ప్రపంచంలో మరెక్కడా ఉండరని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

02/04/2018 - 01:38

విజయవాడ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో శనివారం కంపెనీల ప్రతినిధులు, ఎన్నారైలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించారు.

02/04/2018 - 01:20

హైదరాబాద్, ఫిబ్రవరి 3: బాల్యవివాహాల వల్ల ఎదుర్కొంటున్న బాధలపై 11 మంది బాధితులు రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తమకు బాల్యంలోనే వివాహాలు చేయడం వల్ల బాలల హక్కును కోల్పోయామని, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామని వారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. గర్భం దాల్చడం వల్ల ఒక బాలిక మరణించిందని, ప్రసవించిన శిశువులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు.

02/04/2018 - 00:59

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రైల్వే చేపట్టిన విద్యుదీకరణ పనులు సకాలంలో పని చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వే లైన్ల విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపధ్యంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమని అన్నారు. రానున్న రోజుల్లో విద్యుదీకరణ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అన్నారు.

02/04/2018 - 00:58

హైదరాబాద్, ఫిబ్రవరి 3: పలు వైవిధ్య కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ , దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొనడం ద్వారా ప్రమాణ కార్యక్రమం జోష్ పెంచిందని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రమాణ కార్యక్రమం శనివారం నాడు విజయవంతంగా ముగిసిందని సమన్వయ కర్త డాక్టర్ ఎన్ వి స్వామినాయుడు తెలిపారు.

02/04/2018 - 00:57

హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అపెరెల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాణిజ్య వేత్తల సదస్సు హైటెక్స్ కనె్వంన్షన్ సెంటర్‌లో జరుగుతుందని అపెరెల్ మ్యానుఫ్యాక్చరెర్స్ ఇండియా నిర్వాహకుడు నిఖిల్ ఫురియా తెలిపారు. కర్నాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అపెరెల్ రెడీమేడ్ వస్త్ర తయారీ వాణిజ్యవేత్తలు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు.

Pages