-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, ఫిబ్రవరి 3: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్న భావనతో ఎన్టీఆర్ ట్రస్టు ప్రత్యేక కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది. మహిళల కోసం ప్రత్యేకంగా స్వీట్లు, చైనీస్, బ్రేక్ ఫాస్ట్, రెస్టారెంట్, బేకరీ ఫుడ్స్ను తయారు చేయడంలో అనుభవం ఉన్న వారితో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇవో) టి. విష్ణువర్ధన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 3: అమరావతి.. ఆ పేరు వింటేనే బౌద్ధులు పులకించిపోతారు. దేశ తూర్పు తీరంలో బౌద్ధ మత ప్రచారంలో నాటి అమరావతి ప్రధాన భూమిక పోషించింది. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాజధానికి అమరావతి పేరు పెట్టారు. కృష్ణా, గుంటూరు సహా కోస్తా జిల్లాల్లో బౌద్ధ మతం పరిఢవిల్లిన తీరుకు గుర్తుగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ వాటికి ప్రచారం లేక ప్రపంచ వ్యాప్త గుర్తింపునకు నోచుకోవడం లేదు.
తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేస్తున్న 36 మంది హైందవేతర ఉద్యోగులు టిటిడి ఉద్యోగుల సర్వీసు రూల్స్లో 9 (4) ప్రకారం హైందవేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధించే నిబంధనను తొలగించాలని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. టిటిడి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థని, రాష్ట్రప్రభుత్వ సహాయంతో టిటిడి పనిచేయడం లేదన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన మేరకు నిధులు కేటాయింపు జరుగకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్ ప్రజలపై ఎలాంటి ముద్ర చూపలేదని తెలంగాణ ప్రభుత్వం పెదవి విరిచింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ ప్రగతిశీల నిర్ణయాలతో ముందుకెళ్తుంటే కనీసం కేంద్రం నుంచి చేయూత కరువైందని రాష్ట్ర ప్రభుత్వం వాపోయింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్సభలో ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్లో తెలంగాణకు 19,207.43 కోట్ల రూపాయల నిధులు ప్రతిపాదించారు. గత ఏడాది బడ్జెట్ నుండి తెలంగాణకు 16,420.06 కోట్లు లభించాయి. దాంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో రాష్ట్రానికి 2,787.37 కోట్లు అధికంగా వస్తున్నట్టే. 2018-19 వార్షిక బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ వాటా 2.437 శాతం.
అమరావతి, ఫిబ్రవరి 1: కొద్దిరోజుల క్రితమే ప్రధాని మోదీని కలిసి ఇబ్బందుల దృష్ట్యా బడ్జెట్లో నవ్యాంధ్రను కరుణించాలన్న చంద్రబాబు అభ్యర్థనను పట్టించుకోని కేంద్రం వైఖరిపై తెదేపా అసంతృప్తితో రగిలిపోతోంది. ఏపీకి టోపీ పెట్టి ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టిన వైనంపై అసహనం వ్యక్తం చేస్తోంది. కేంద్ర వైఖరిపై ఏవిధంగా అసంతృప్తి, నిరసన వ్యక్తం చేయాలన్న అంశంపై పార్టీ అంతర్మథనంలో పడింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్సభలో ప్రతిపాదించిన 2018-19 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 33,929.84 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. గత ఏడాది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 29,001.25 కోట్లు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్లో ఏపీకి 4,928.59 కోట్లు అధికంగా లభిస్తున్నట్టు. ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 4.305 శాతం.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: దేశంలో రైతు, గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభు త్వం పెద్దపీట వేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్లో అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనివల్ల ఏటా 50కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, విభజన సమస్యలను ప్రస్తవించకపోవడంపై ఆ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది తొలి నాలుగునెలల్లో మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను రూపొందించారని, ఆరోగ్య బీమాకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమైన పరిణామమని కోటక్ మహీంద్ర బీమా కంపెనీ చీఫ్ ఇనె్వస్టిమెంట్ ఆఫీసర్ సుధాకర్ షాంబాగ్ అన్నారు. ద్రవ్యలోటు 3.5 శాతం ఉండడం ఎక్కువన్నారు.