S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/31/2018 - 00:50

అమరావతి, జనవరి 30: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. పాదయాత్ర మధ్యలోనే ఆయన ప్రధానితో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం..

01/30/2018 - 04:05

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జనవరి 29: సైబరాబాద్ పరిధిలోని చందానగర్‌లో దారుణం జరిగింది. ఒకేసారి ముగ్గురిని హత్య చేయడం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ప్రియురాలు, కన్న బిడ్డతో పాటు అత్తను కూడా అంతమొందించిన దుర్మార్గుడు రెండు రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

01/30/2018 - 03:45

హైదరాబాద్, జనవరి 29: సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చినా, అడ్డుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమైందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ ఎం ఎస్ కె జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

01/30/2018 - 03:37

హైదరాబాద్, జనవరి 29: ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను ఏప్రిల్ నెల తర్వాతనే చేపట్టాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల వివరాలను వెల్లడిస్తామని, గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రమే విద్యార్థులు చేరాలని ఆయన సూచించారు. ముందుగా అడ్మిషన్లను చేపట్టే కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

01/30/2018 - 03:36

హైదరాబాద్, జనవరి 29: రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మ బలికి అమాయకులైన వారి నుంచి సొమ్ములు వసూలు చేసిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమాన విధిస్తూ సిబిఐ కేసుల న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిబిఐ డిఐజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

01/30/2018 - 03:32

తిరుపతి, జనవరి 29: దేశంలో ఈనెల 31న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం లాంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం రాత్రి 10.30నిమిషాలనుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఏకాంత సేవతో స్వామివారి ఆలయాన్ని మూసివేస్తారు.

01/30/2018 - 03:11

హైదరాబాద్, జనవరి 29: యాభైవేలు, ఆపైగా విలువైన సరకులను రవాణా చేసేందుకు వ్యాపారులు తప్పనిసరిగా ఈ-వే బిల్లులను తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వి. అనిల్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ నిబంధన 2018 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తుందన్నారు.

01/30/2018 - 02:17

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వినియోగదారులకు సేవలు అందివ్వడంలో దేశంలోనే ప్రథమ స్థానం పొందిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

01/30/2018 - 02:14

హైదరాబాద్, జనవరి 29: గణతంత్ర దినోత్సవ వేదికపై వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి చేసిన ప్రసంగం నవ్వులపాలు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సోమవారం కలక్టర్ అమ్రపాలికి ఫోన్ చేసిన వివరణ కోరారు. కలక్టర్ హోదాలో ఉండే వ్యక్తి హుందగా వ్యవహరించాలని సిఎస్ హితవు పలికారు.

01/30/2018 - 02:13

హైదరాబాద్, జనవరి 29: కేంద్ర ఆర్థిక సర్వేలో ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా రాష్ట్రా ల్లో మొదటి ఐందింటిలో తెలంగాణకు చోటు దక్కింది. దేశ ఎగుమతుల్లో మొదటి ఐదింటిలో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ మొదటి ఐదింటిలో స్థానం దక్కడం పట్ల ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్ చేసారు.

Pages