S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/13/2020 - 05:35

హైదరాబాద్, మార్చి 12: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు సమర్థవంతమైన పరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో అప్పులులేని రాష్ట్రంగా మారుతుందని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ, టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ ఫోటోతోనే గెలిచామన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు.

03/13/2020 - 05:35

హైదరాబాద్, మార్చి 12: మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వాసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

03/13/2020 - 05:34

హైదరాబాద్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టుకునేందుకు ‘్ఛలో ఢిల్లీ’ కార్యక్రమం పెడితే, సహకరిస్తామని బిజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో పాల్గొంటూ, ప్రధానమంత్రి మాతృవందనం పేరుతో మన రాష్ట్రానికి ఇచ్చిన 75 కోట్ల రూపాయలను కేసీఆర్ కిట్స్ కార్యక్రమానికి వాడుతున్నారని ఆరోపించారు.

03/13/2020 - 05:33

హైదరాబాద్, మార్చి 12:రాష్ట్రంలో పేదవాళ్ల ఇళ్ల నిర్మాణాలపై ఇటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అటు కాంగ్రెస్ పక్ష నేత జీవన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఒకరిపై నొకరు తమ పట్టుసాధించుకోవడానికి ఇళ్ల నిర్మాణాలపై రగడకు దిగారు. గురువారం శాసన మండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో పేదవాళ్ల ఇళ్ల నిర్మాణాలపై చర్చ ఆశక్తిగా మారింది.

03/13/2020 - 05:33

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

03/13/2020 - 05:32

హైదరాబాద్, మార్చి 12: కేసీఆర్ హయాంలో పరిపాలనకు సంబంధించి అనేక పొరపాట్లు, తప్పులు జరుగుతూ ఉన్నప్పటికీ, వాటిని ఒప్పుకునేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు ఆరోపించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో పాల్గొంటూ, ప్రతిపక్షంగా బాధ్యతగా ఉంటున్న తమ పార్టీ సూచించిన సూచనలను కూడా కేసీఆర్ ప్రభుత్వం వినే పరిస్థితిలో లేరన్నారు.

03/13/2020 - 05:31

హైదరాబాద్, మార్చి 12: టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయడం వల్లనే రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆర్థిక మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

03/13/2020 - 01:24

హైదరాబాద్, మార్చి 12: రాజ్యసభ అభ్యర్థుల ఉత్కంఠ వీడింది. టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుకు తిరిగి అవకాశం కల్పించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్

03/13/2020 - 01:18

హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికతో ఉత్కంఠ వీడటంతో ఈ సీటు కోసం పోటీ పడిన నేతలు తమకు కనీసం ఎమ్మెల్సీగానైనా అవకాశం ఉంటుందేమోనని ఆశిస్తున్నారు. అయితే, రాజ్యసభ సీటుకు పోటీపడిన మాజీ ఎంపీలు ఎవరూ ఎమ్మెల్సీ స్థానంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని తెలిసింది. దీంతో మిగతా నాయకులు మాత్రం ఎమ్మెల్సీతో సర్దిపెట్టుకోవడానికి కూడా

03/13/2020 - 01:17

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు బిచ్చం కాదని, రాజ్యాంగ హితమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు టీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రం పాలనలో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ అట్టర్‌ఫ్లాప్ అయ్యాయని సీఎం కేసీఆర్ చెప్పారు.

Pages