S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/18/2017 - 00:53

గోదావరిఖని, ఆగస్టు 17: రాష్ట్రంలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరు తరలించుకుపోతూ... ప్రాజెక్ట్ నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసిన రామగుండంనకు సాగు, తాగునీరు ఇవ్వకుంటే ఎల్లంపల్లి నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోనివ్వమని శాప్ మాజీ చైర్మన్ రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ హెచ్చరించారు.

08/17/2017 - 23:16

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ పేర్కొన్నారు. స్థానిక సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో వివిధ రైల్వే ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు 17445 కోట్లతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

08/17/2017 - 23:15

హైదరాబాద్/శంషాబాద్, ఆగస్టు 17: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు భారీ విదేశీ కరెన్సీ పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 57 లక్షలు విలువ చేసే దిర్హం (దుబాయి) సౌదీ రియాల్స్ (సౌదీ అరేబియా), ఒమానీ రియాల్స్ (ఒమన్)ను స్వాధీనం చేసుకున్నారు.

08/17/2017 - 23:14

హైదరాబాద్, ఆగస్టు 17: ఈ నెల 27 నుంచి 31 వరకు ఉద్యానమహోత్సవం 2017 నిర్వహిస్తున్నట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ తెలిపింది. ఉద్యాన మహోత్సవం నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ కమిటీలు, చైర్మన్లు, సభ్యులతో ఉద్యాన శాఖ కార్యదర్శి సి.పార్థసారథి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉద్యాన శాఖ సంచాలకుడు వెంకటరామ్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

08/17/2017 - 23:14

హైదరాబాద్, ఆగస్టు 17: మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ హితంగా గణపతి ఉత్సవాలు చేసుకోవాలని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు సూచించారు. మట్టి వినాయకుల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శిల్ప కళావేదికలో గురువారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో రెండు లక్షల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టు సమావేశంలో మాట్లాడిన మంత్రి కెటిఆర్ చెప్పారు.

08/17/2017 - 23:13

హైదరాబాద్, ఆగస్టు 17: విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న స్వచ్చందసేవా సంస్ధలు బ్యాంకుల్లో విదేశీ కాంట్రిబ్యూషన్స్ రిజిస్ట్రేషన్స్ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఏ) కింద చెల్లుబాటయ్యే ప్రత్యేక అకౌంట్లను తెరవకపోవడంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని పలు ఎన్‌జివోలకు ప్రత్యేక అకౌంట్లను తెరిచి పర్యవేక్షించకపోవడంపై నోటీసులను జారీ చేసింది.

08/17/2017 - 23:12

హైదరాబాద్, ఆగస్టు 17: దేవాదాయ శాఖకు చెందిన భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. ఆక్రమణలు ఉంటే అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. అత్తాపూర్ అనంత పద్మనాభ ఆయల భూములను మంత్రి గురువారం పరిశీలించారు. శ్రీపద్మనాభ స్వామి అలయానికి చెందిన భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు రావడంతో మంత్రి స్పందించారు.

08/17/2017 - 02:19

హైదరాబాద్/జీడిమెట్ల: భారతదేశంలోనే సంక్షేమానికి స్వర్ణయుగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, విశ్వనగరం దిశగా నగరంలో డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ సరఫరాను తీసుకువస్తామని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

08/17/2017 - 02:19

హైదరాబాద్: పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బుధవారం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.

08/17/2017 - 02:18

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 19న భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న ఐదురోజుల్లో సంభవించే వాతావరణ వివరాలను వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 19న మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Pages