S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

07/15/2017 - 01:40

హైదరాబాద్, జూలై 14: వోకేషనల్ కోర్స్‌లు అభ్యసించిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1985 అమలుపై ఏం చర్యలు తీసుకుందో తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఇ భవాని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ జీవోను అమలు చేయలేమని అధికారులు చెప్పాడాన్ని హైకోర్టులో ఆమె సవాల్ చేసింది.

07/14/2017 - 23:25

న్యూఢిల్లీ, జూలై 14: తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల(బీసీ) జాబీతా నుంచి 26 కులాలను తొలిగించడాన్ని సవాల్ చేస్తు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఆరు వారాలు వాయిదా పడింది. శుక్రవారం నాడు జస్టిస్ మదన్ బి లోకూర్‌తో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి.

07/14/2017 - 23:24

హైదరాబాద్, జూలై 14: రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణానికి రూ. 2509.66 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ మేరకు జీవో 40ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్దేశించిన పరిమితులు, పని, నాణ్యతకు లోబడి ఇంతవరకు జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈవిషయమై ఇంజనీర్ ఇన్ చీఫ్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

07/14/2017 - 23:24

హైదరాబాద్, జూలై 14: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ డ్రగ్ మాఫియా వెన్ను విరుస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డిఐజి అకున్ సబర్వాల్ శనివారం నుంచి పదిరోజుల పాటు సెలవుపై వెళుతున్నట్లు సమాచారం.ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆయన సెలవుపై వెళుతున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. చివరి నిమిషంలో మార్పు జరిగితే తప్ప సెలవును రద్దుచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

07/14/2017 - 23:23

హైదరాబాద్, జూలై 14: వర్షా కాలం ప్రారంభమై దాదాపు నెల రోజులు గడచినా సరిపడా వర్షాలు పడలేదు. గడచిన నెల రోజుల్లో రెండు, మూడు సార్లు భారీ వర్షాలు కురిశాయి తప్ప చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. రుతుపవనాలు బలహీన పడ్డంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు ముఖం చాటేయడంతో మరో వైపు జలాశయాల్లోనూ నీటి మట్టాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

07/14/2017 - 23:23

హైదరాబాద్, జూలై 14: ఒక్క రోజులోనే ఈ నెల 15వ తేదీన తెలంగాణలో 28 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మూడో దశ హరితహారంలో భాగంగా విద్యాశాఖ మొక్కలు నాటే పండగను ఒక యజ్ఞంలా నిర్వహించనుందని అన్నారు. జూలై 15వ తేదీన గ్రీన్‌డే పాటిస్తూ తెలంగాణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం రూపొందించామని పేర్కొన్నారు.

07/14/2017 - 23:22

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో కొత్తగా 39 వైద్య శాలల్లో 268 సింగిల్ యూజ్డ్ డయాలసిస్ యూనిట్లు నెలకొల్పేందుకు వీలుగా తెలంగాణ వైద్య సేవలు వౌలిక వసతుల అనివృద్ధి సంస్ధ ఆదేశాలు జారీ చేసిందని వైద్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ యూనిట్లకు సంబంధించి పరికరాల కొనుగోలుకు టెండర్లను కూడా పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వీటిని నడిపేందుకు రంగం సిద్ధమైందన్నారు.

07/14/2017 - 02:56

భూదాన్‌పోచంపల్లి, జూలై 13: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దమ్ముంటే కలుషితమైన మూసీ నీళ్లు తాగి అసెంబ్లీకి వెళ్లాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సవాల్ చేశారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో మూసీపై రైతు పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. మూసీ నది బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

07/14/2017 - 02:55

నల్లగొండ, జూలై 13: అధికారంలో ఉన్నప్పు డు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రైతాంగం సంక్షోభంలో ఉందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని రైతు సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత కాం గ్రెస్ పార్టీకి లేదని రాష్ట్ర ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విమర్శించారు.

07/14/2017 - 02:52

సంగారెడ్డి, జూలై 13: మహారాష్టల్రోని వార్ధా నుండి ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లా వరకు నిర్మిస్తున్న విద్యుత్ హైటెన్షన్ టవర్లకు సంబంధించిన పరిహారం కోసం రైతులు గురువారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించగా గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిహారం చెల్లిస్తామని పూర్తి హామీ ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పలువురు రైతులు విషం డబ్బాలను వెంట తెచ్చుకున్నారు.

Pages