S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

, ,
03/12/2020 - 06:34

వేములవాడ, మార్చి 11 : సిరిసిల్ల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం శివకల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయ.

,
03/12/2020 - 06:29

మహబూబ్‌నగర్, మార్చి 11: పాలమూరు ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల హక్కులసాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. గత పదిహేనురోజులుగా పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని వల్లూర్ గ్రామంలో భూనిర్వాసితులు దీక్షలు చేస్తున్నారు.

03/12/2020 - 06:25

కరీంనగర్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నియమితులవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి సంజయ్ ఎంపీగా గెలుపొందారు. బండి నర్సయ్య-శకుంతల దంపతులకు 11-7-1971లో సంజయ్ జన్మించారు. ఆయన సతీమణి అపర్ణ ఎస్‌బిఐలో ఉద్యోగిని కాగా, సంజయ్‌కు సాయి భగీరథ్, సాయి సుముఖ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

03/12/2020 - 06:21

నల్లగొండ, మార్చి 11: ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన హైకోర్టు న్యాయవాది పి.కిషోర్ నల్లగొండ పట్టణంలోని నవ్య ఆసుపత్రిలో చికిత్స పొందారు.

03/12/2020 - 06:18

హైదరాబాద్, మార్చి 11: రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించి ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకువచ్చేందుకు, కౌంటర్ దాఖలుకు రాష్ట్ర హైకోర్టు వచ్చే నెల 8 వరకూ గడువు విధించింది.

,
03/12/2020 - 00:47

హైదరాబాద్: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థులు బుధవారం నాడు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఒక దశలో లాఠీచార్జి చేయడంతో ఏబీవీపీ నేతలు గాయపడ్డారు.

03/12/2020 - 00:41

హైదరాబాద్, మార్చి 11: హైదరాబాద్‌లో మెట్రోరైల్ విజయవంతమైన ప్రాజెక్టు అని, ప్రపంచంలోనే అగ్రశ్రేణి మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటిగా స్థానం సంపాదించిందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాగంటి గోపీనాథ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ప్రతిరోజూ మెట్రో రైలులో దాదాపు 4 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయన్నారు.

03/12/2020 - 06:49

హైదరాబాద్: నేరం చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడుతుందన్న భావనను సృష్టించడంలో తెలంగాణ పోలీసు శాఖ సఫలమైందని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థినులు, మహిళల భద్రత కోసం తొలి దశగా రాష్ట్రంలోని 2,500 కాలేజీల్లో సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీ సు శాఖలోని మహిళా భద్రత విభా గం ఆధ్వర్యంలో

03/12/2020 - 00:54

హైదరాబాద్, మార్చి 11: రాజ్యసభ సీటుపై తనకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం అందలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శాసనసభకు వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును కలిశారు.

03/11/2020 - 07:27

హైదరాబాద్, మార్చి 10: ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నందు వల్ల తెలంగాణలో నేడు ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణ సరిహద్దులోని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటం వల్ల తెలంగాణలో ‘కరోనా..

Pages