-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్లో సనత్నగర్- వౌలాలి రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డబ్లింగ్ పనులకు ఆటంకంగా మారిన ఆర్మీకి చెందిన స్ధలం భూసేకరణ పనుల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం కమిటీని నియమించింది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎంఎంటిఎస్ పనులను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ చేపట్టింది.
చిత్రం..అసోంలోని గౌహతిలో ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని ఆలయాన్ని సందర్శించిన ఎంపి కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్రెడ్డి
హైదరాబాద్/కెపిహెచ్బికాలనీ, జూలై 2: అతివేగం ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది. బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ముగ్గురు కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనం చేసుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లపోయారు. పటాన్చెరు మండలం రామచంద్రాపురం చెందిన నర్సింహులు, లలిత దంపతుల కుమార్తె శిరీషతో కలసి ముగ్గురు ద్విచక్రవాహనంపై నగరంలోని బల్కంపేట ఎల్మమ్మ తల్లి దర్శనానికి బయలుదేరారు.
హైదరాబాద్, జూలై 2: వస్తు సేవ పన్ను అమలుతో ఆర్టీసీ ఏసీ బస్సుల చార్జీలు ఒక శాతం తగ్గనున్నాయి. ఏసి బస్సుల్లో 6శాతం ఉన్న సర్వీస్ టాక్స్, 5 శాతానికి తగ్గిందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీ జోన్ పరిధిలో 157 ఏసి బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో రోజు లక్ష మంది ప్రయాణిస్తుంటారు. మరో పది ఏసీ బస్సులను విశాఖపట్నం, విజయవాడ, బెంగుళూరుకు నడుపుతోంది.
హైదరాబాద్, జూలై 2: జోనల్ వ్యవస్థ రద్దుకు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో మిగిలిన ప్రక్రియపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టిసారించింది. జోనల్ వ్యవస్థ రద్దు తదనంతరం జోనల్, మల్టీ జోనల్ పరిధిలో నియామకం అయిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను అలాగే కొనసాగిస్తూ కొత్తగా జరుగబోయే నియామకాలలో స్టేట్, డిస్ట్రిక్ట్ రెండంచల వ్యవస్థనే కొనసాగించాలన్నది ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల వాదన.
బొంరాస్పేట, జూలై 2: పండంటి కొడుకు పుడితే నీ సన్నిధిలోనే వెంట్రుకలు తీస్తాం.. మైసమ్మతల్లీ.. మమ్మల్నీ కరుణించు అని మొక్కుకున్నారు..అమ్మవారు కరుణించింది..కొడుకు పుట్టాడు.. తమ మొక్కును చెల్లించేందుకు అమ్మవారి గుడికి వచ్చారు. అంతా సవ్యంగా సాగిపోతోన్న తరుణంలో విధి వారిని వెక్కిరించింది. ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది..
హైదరాబాద్/వరంగల్ జూలై 2: నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు (నీట్)-2017 ఫలితాల రీజనల్ ర్యాంకులను తెలంగాణలోని కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయం (వరంగల్) ఆదివారం రాత్రి ప్రకటించింది.
హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్ ఐటి కారిడార్లో రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ యేడు మే నెలాఖరు వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 32 పోలీస్ స్టేషన్ల పరిధిలో 1009 రోడ్డు ప్రమాదాల జరుగగా 343 మంది మృతి చెందారు. సైబరాబాద్ పరిధిలో 269 ప్రమాదాలు జరుగగా 341 మంది మృతి చెందినట్టు ట్రాఫిక్ పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
హైదరాబాద్, జూలై 2: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రైతుల వివరాలు, వారికి సంబంధించిన భూముల వివరాలు 2017 జూన్ 10 లోగా సేకరించి పంపించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఈ మేరకు పూర్తి వివరాలు ఏమీ అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎకరాకు నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి వివరాలు సేకరించాలని 2017 ఏప్రిల్లోనే నిర్ణయించింది.
హైదరాబాద్, జూలై 2:సికిందరాబాద్ బోనాల జాతరను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు పశు సంవర్థక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత బోనాల జాతరను ప్రభుత్వ పండుగగా జరుపుతున్నట్టు చెప్పారు.