-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
వరంగల్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాల కారణంగా వ్యాపారులు, ప్రజలు తమకు జరిగే అన్యాయం గురించి అడిగే పరిస్థితి లేకుండా పోతోందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ వచ్చాక వ్యాపారాలు నడపలేని పరిస్థితులు ఏర్పడినట్లు వ్యాపారులు వాపోతున్నారని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 30: హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్ఆర్) నిర్వహణ బాధ్యతలను త్వరలో ప్రైవేటు ఏజెన్సీలకు టిఒటి పద్దతిలో అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఒఆర్ఆర్ నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలెప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్వహిస్తోంది.
హైదరాబాద్, జూన్ 30: ముఖ్యమంత్రి అసమర్ధపాలన వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలను పూర్తిగా అమలుచేయడం లేదని అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు.
హైదరాబాద్, జూన్ 30: కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల ట్రస్టు కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ(78)కు శుక్రవారం అంబర్పేట స్మశానవాటికలో ఆయన కుమారుడు అంతిమసంస్కారాన్ని నిర్వహించారు. సంఘ్, బిజెపి, ఎబివిపి , విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యానిపుణులు, కార్యకర్తలు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు.
హైదరాబాద్, జూన్ 30: మత్స్య రంగ సమగ్రాభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మత్స్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 30: వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) అమలు వల్లన తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.2500 కోట్ల అదాయనికి నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం జీఎస్టీ అమలును సమర్థిస్తూనే, తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియాజేశామని చెప్పారు.
హైదరాబాద్, జూన్ 30: రాష్టప్రతి పదవి కోసం యుపిఎ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీరా కుమార్కు మద్దతు ఇవ్వాల్సిందిగా మజ్లిస్ పార్టీని కోరనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మజ్లిస్ నేత, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని కలిసి కోరనున్నట్లు ఉత్తమ్కుమార్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.
హైదరాబాద్, జూన్ 30: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక చర్యలు చేపట్టిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. అంతేగాక, అత్యాచారం కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్షపడేలా మరిన్ని సంస్కరణలు తీసుకురావల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు, చిన్నారుల భద్రతపై శుక్రవారం నగరంలోని హోటల్ ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.
హైదరాబాద్, జూన్ 30: కమీషన్ పద్దతిని రద్దు చేసిన ప్రభుత్వం తమకు నెలసరి జీతాలను చెల్లించటంతో పాటు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు శుక్రవారం సిఎం క్యాంపు ఆఫీసును ముట్టడించేందుకు విఫలయత్నం చేశారు. ముందస్తుగా సమాచారం తెల్సుకున్న పోలీసులు సిఎం క్యాంపు కార్యాలయం, పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, జూన్ 30: మెరిట్, ఆన్లైన్ డ్రగ్ లైసెన్స్ విధానాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోని మొదటిసారి ఆన్లైన్ డ్రగ్ లైసెన్సింగ్ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ పాలసీ ప్రమోషన్లో భాగంగా కొత్త ఆన్లైన్ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు.