S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/28/2017 - 03:15

హైదరాబాద్, జూన్ 27: నగరంలో 12 లక్షల మంది బడి పిల్లల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 29న రవీంద్రభారతిలో పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవడం కోసం అవసరమైన పలు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. నగరంలో 3218 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.

06/28/2017 - 03:14

న్యూఢిల్లీ,జూన్ 27: దేశ రాజధాని ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా రెండో రోజూ అందరిని అకట్టుకున్నాయి. తెలంగాణ భవన్‌లో తెలంగాణ ప్రభుత్వం, లాల్ దర్వాజ ఆలయకమిటీ సంయుక్తంగా బోనాల సంబురాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు జరిగిన వేడుకలలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ వినోద్‌కుమార్,ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు.

06/28/2017 - 03:11

న్యూఢిల్లీ, జూన్ 27: వాల్‌మార్ట్‌ను చిల్లర మార్కెట్‌లోకి అనుమతించకూడదని, ఎరువులపై జిఎస్‌టిని విధించరాదని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అరుణ్ జైట్లీకి ఆయన లేఖ రాశారు.

06/28/2017 - 03:10

న్యూఢిల్లీ,జూన్ 27: ప్రతిపక్షాలు బలపరిచిన రాష్టప్రతి అభ్యర్థి మీరాకుమార్ నామినేషన్ పత్రాలపై టిపీసీసీ నేతలు సంతకాలు చేశారు. మంగళవారం ఢిల్లీకి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి, గీతారెడ్డి, డి.కె అరుణ, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రామ్‌మోహన్‌రెడ్డి సంతకాలు చేసారు. అనంతరం మీరాకుమార్ నివాసానికి వేళ్లి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

06/28/2017 - 03:09

ఆదిలాబాద్: జూన్ 27: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. భారీ వర్షానికి వాగుల్లో చిక్కుకొన్ని ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాగ్వి గ్రామంలోని వాగులో ఖలీం (21) అనే యువకుడు ప్రమాదవశాత్తు వరదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.

06/28/2017 - 03:08

హైదరాబాద్, జూన్ 27: ఫోటోలు చూస్తే స్టార్ హోటల్స్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది .. కానీ ఆవి స్టార్ హోటల్స్ కావు. ఆస్పత్రులు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కావు. పక్కా ప్రభుత్వ ఆస్పత్రులు. కొత్త ఫర్నిచర్‌తో కొత్త లూక్‌లో ఆస్పత్రులను చూసి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సైతం ముచ్చటపడి ఆస్పత్రుల దృశ్యాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. కింగ్ కోటి, మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రులు కొత్త హంగులతో అలరిస్తున్నాయి.

06/27/2017 - 23:23

హైదరాబాద్, జూన్ 27: కంటి ఆపరేషన్ కోసం ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ గత రెండు రోజుల నుంచి నామినేటెడ్ పదవులపై పార్టీ నాయకులతో కసరత్తు సాగిస్తున్నారు. నియోజక వర్గాల వారీగా నామినేటెడ్ పదవుల కోసం పదిహేను మంది పేర్లతో ఎమ్మెల్యేలు, నియోజక వర్గం ఇన్‌చార్జ్‌లు ఇంతకు ముందే కెసిఆర్‌కు జాబితా అందజేశారు. కొంత మంది నాయకులతో కెసిఆర్ ఢిల్లీ నుంచే ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.

06/27/2017 - 23:22

హైదరాబాద్, జూన్ 27: పాఠ్యపుస్తకాల సంస్కరణకు సంబంధించి మంగళవారం నాడు ఢిల్లీలో జరిగిన ఎన్‌సిఇఆర్‌టి 54వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ‘యుద్ధం’ జరిగింది. వివిధ రాష్ట్రాల మంత్రులు, జనరల్ కౌన్సిల్ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 53వ జనరల్ కౌన్సిల్ మినిట్స్‌ను ఆమోదించిన జనరల్ కౌన్సిల్ 54వ సమావేశంలో ప్రధానంగా పాఠ్యపుస్తకాల సంస్కరణలపై విస్తృతంగా చర్చించింది.

06/27/2017 - 23:22

హైదరాబాద్, జూన్ 27: ‘మా పెళ్ళికి శిరీష అడ్డుతగిలింది..’ అని తేజస్వి పోలీసుల విచారణ వెల్లడించింది. బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా? అనే అంశంపై ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. ఇలాఉండగా శిరీష కేసులో నిందితులు ఎ-1 శ్రవణ్, ఎ-2 రాజీవ్‌ల విచారణ కొనసాగుతున్నది.

06/27/2017 - 23:20

హైదరాబాద్, జూన్ 27: ఐ-సేవా ద్వారా కూడా రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా రైల్వే టిక్కెట్‌లు బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసితో ఇదివరకే ఒప్పందం చేసుకున్నామని హైదరాబాద్, ఆదర్శ నగర్‌లోని ‘ఐ-సేవ’ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ శ్రీ్ధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Pages