-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 25:వచ్చేనెల నుంచి గ్రామాల్లోని బార్బర్ షాపుల రూపు రేఖలు మారిపోనున్నాయి. నారుూ బ్రాహ్మణులు, రజకులకు వృత్తి పని పరకరాల కోసం ప్రభుత్వం ఐదువందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. నగరాల్లో బార్బర్ షాపులు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చెట్టు కిందనో, అరుగుపైనో క్షౌరం చేసే పరిస్థితులు ఉన్నాయి.
హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో మరిన్ని నవోదయ స్కూళ్లను పెంచాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ను కోరారు. నాణ్యమైన విద్య, జాతి సమగ్రతకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలల వ్యవస్థ దేశంలో చాలా బాగా అమలు జరుగుతోందని లక్ష్మణ్ తెలిపారు.
హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణ, మధ్యభారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వచ్చే మూడురోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వచ్చే 48 గంటల్లో ఇవి గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలకు విస్తరిస్తాయన్నారు.
హైదరాబాద్, జూన్ 25: ఎన్డిఏ ప్రతిపాదించిన రాష్టప్రతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇచ్చే విషయమై సిఎం కెసిఆర్ పునరాలోచించాలని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడిక్కడ గాంధీభవన్లో రంజాన్ పండుగ సందర్భంగా పేద మహిళలకు రంజాన్ రేషన్ కిట్లను ఉత్తమ్ పంపిణీ చేశారు.
హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ ప్రజలకు సిఎం కె.చంద్రశేఖరరావు, గవర్నర్ నరసింహన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకు వస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా, గంగా జమునా తహజీబ్ సంస్కృతి ప్రతిఫలించేలా పండుగ చేసుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
కొత్తగూడెం, జూన్ 24: సింగరేణి వ్యాప్తంగా పదిరోజులుగా వారసత్వ ఉద్యోగాల పథకం అమలు కోసం నిర్వహిస్తున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాల నాయకులు శనివారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని 11 ఏరియాల పరిధిలోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
సిద్దిపేట, జూన్ 24 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. ఈసంవత్సరం పాటు వచ్చే సంవత్సరం సైతం మరో డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్తగా 26 వేల పోలీసు కానిస్టేబల్ పోస్టుల భర్తీకి సిఎం కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
రామాయంపేట, జూన్ 24: గత ఆంధ్రా పాలకుల మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి పాలన ఉందని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల స్ఫూర్తియాత్రలో భాగంగా శనివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నిజాంపేటకు చేరుకున్న బస్సుయాత్రకు ప్రజలు, జెఎసి నాయకులు ఘనస్వాగతం పలికారు. రైతులు, వృద్ధులు పింఛన్లు, రుణమాఫీ, రేషనుకార్డులు రాలేదని కోదండరాం దృష్టికి తీసుకువచ్చారు.
రామాయంపేట, జూన్ 24: తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మించే కాలేశ్వరం ప్రాజెక్టును ఎంతమంది కోదండరాంలు అడ్డుకున్నా కట్టితీరుతామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాలు ఆర్థిక పరిపుష్టి చెందాలని ప్రభుత్వం పనిచేస్తుంటే కోదండరాంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ కళాకారులందరినీ డిజిటల్ ప్రపంచంలోకి తీసుకు వచ్చేందుకు గాను తెలంగాణ రాష్టభ్రాషాభివృద్ధి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక వైబ్సైట్ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా కళాకారులందరూ తమ పేర్లను నమోదు చేసుకునే వీలుంటుంది. ఇంతేకాకుండా డిజిటల్ గుర్తింపు కార్డులను సైతం జారీ అవుతాయి.