-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: పెండ్యాల మోహనాచారి.. సరిత.. ఇద్దరూ విద్యావంతులే... ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో చేసుకొని ఎలాంటి సమస్య లేకుండా జీవితం గడపగల దంపతులే.. కానీ, ఇద్దరికీ వ్యవసాయమంటే ప్రాణం. కానీ అదే వారి ప్రాణాలను హరించింది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, రంగాపురానికి చెందిన ఈ దంపతులు శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడం రైతుల కష్టాలకు అద్దం పడుతోంది.
హైదరాబాద్, జూన్ 24: మనుషుల మధ్య ఘర్షణను సృష్టించి కృత్రిమ ప్రపంచానికి నాంది చెప్పిన పెట్టుబడి దారీ వ్యవస్థ నుంచి ప్రజలను కాపాడేందుకు కారల్మార్క్స్ ‘క్యాపిటల్ గ్రంథం’ అవసరం చాలా ఉందని మానవ హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఈ గ్రంథం కార్మికులకు ధైర్యం, పెట్టుబడిదారులకు భయం, భవిష్యత్తుకు విశ్వాసం కలిగిస్తుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రాజీవ్, శ్రవణ్లను మళ్లీ రెండురోజుల పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు శనివారం నిందితులు శ్రవణ్, రాజీవ్లను పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది.
హైదరాబాద్, జూన్ 24: ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయకముందే కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయని, గత ఏడాది డిసెంబర్లోనే చేసుకున్న అడ్మిషన్లను రద్దు చేయాలని ఎబివిపి నేతలు శనివారం నాడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎబివిపి నాయకులు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ను కలిసి వినపతిపత్రం అందజేసినట్టు పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ అయ్యప్ప తెలిపారు.
హైదరాబాద్, జూన్ 24: చెరువులు, ప్రాజెక్టుల కింద ఏయే కులాల వారికి ఎంత భూమి ఉంది?, నీటి పారుదల సౌకర్యాల ద్వారా ఏయే కులాలు ఏ మేరకు లబ్ది పొందుతున్నారో గణాంకాలు అందజేయాలని రాష్ట్ర బిసి కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్, జూన్ 24: జెఎన్టియు హైదరాబాద్లో చదువుకున్న విద్యార్ధులకు ఉన్నత విద్యకు, పరిశోధనలకు, ఉపాధికి, ప్రాజెక్టుల ప్రోత్సాహానికి తోడ్పడేలా టిసిఎస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. టిసిఎస్ వైస్ ప్రెసిడెంట్ , జెఎన్టియు విసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
హైదరాబాద్, జూన్ 24: ప్రధాని నరేంద్ర మోదీ మాయలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పడ్డారని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. రాష్టప్రతి పదవికి యుపిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరాకుమార్కు ఓటు వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్కు దండం పెట్టి కోరుతున్నానని సర్వే శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. మీరాకుమార్కు మద్దతు ఇవ్వకపోతే ప్రజలు క్షమించరని ఆయన తెలిపారు.
హైదరాబాద్, జూన్ 24: హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారని, ఎయిర్పోర్టు భద్రతకు ముప్పు వాటిల్లనుందని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎయిర్పోర్టు అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్, జూన్ 24: నీటిపారుదల పథకాల్లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో శనివారం ఆయన తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లలో బిసిలు ఎంత మంది ఉన్నారో తెలియచేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్, జూన్ 24: గిరిజనుల రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న ఆరు శాతం నుంచి తొమ్మిది శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రెండు వారాల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో మైనారిటీలకు నాలుగు నుంచి 12శాతానికి పెంచుతూ, గిరిజనులకు ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.