S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/24/2017 - 02:59

హైదరాబాద్, జూన్ 23: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరం అయిన విద్యుత్‌పై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

06/24/2017 - 02:58

నల్లగొండ, జూన్ 23: సంతాన సాఫల్య కేంద్రం ముసుగులో పేద కుటుంబాల మహిళలకు డబ్బు ఎరచూపి నిబంధనలకు విరుద్ధంగా సరోగసి(అద్దెగర్భం) దందా సాగిస్తున్న మరో ఆసుపత్రి నిర్వాకం అధికారుల దాడుల్లో బట్టబయలైంది. భువనగిరిలోని నవ్యనర్సింగ్‌హోం, పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో సోమవారం డిఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్డీవో భూపాల్‌రెడ్డిల బృందం నిర్వహించిన దాడుల్లో 125మంది సరోగసి మహిళలను అధికారులు గుర్తించారు.

06/24/2017 - 02:57

హైదరాబాద్, జూన్ 23: సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాల కోసం మూడు నెలలుగా చేస్తున్న సమ్మెకు ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మద్దతు ప్రకటించారు. హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘం నాయకుడు రియాజ్ అహ్మద్ అధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఆఫీసు ముందు జరిగిన ధర్నాలో డాక్టర్ చెరుకు సుధాకర్ పాల్గొని మద్దతు పలికారు.

06/24/2017 - 02:57

గోదావరిఖని, జూన్ 23: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని జాతీ య కార్మిక సంఘాలు నిరవధిక సమ్మె చేస్తుం టే... మరో పక్క సమ్మె విచ్ఛిన్నానికి యాజమాన్యం నిర్బంధంతో విధులను చేయించుకోవడంతో శుక్రవారం వనం రాజేంద్ర ప్రసాద్ అనే హెడ్ ఓవర్ మేన్ నిండు ప్రాణాన్ని సింగరేణి భారీ డంపర్ మింగేయడంతో గని కార్మిక సంఘాలు తిరగబడ్డాయి.

06/24/2017 - 02:55

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల భూ కుంభకోణానికి ప్రణాళికా బద్దంగానే పథక రచన జరిగిందని, దీని వెనుక సిఎం కెసిఆర్ పాత్రపై పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆయన శీల పరీక్షకు నిలవాల్సిందేనని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మియాపూర్ భూ కుంభకోణంలో రెండు సర్వే నెంబర్లలోని 123 ఎకరాల భూముల విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని ఆయన కెసిఆర్‌ను నిలదీశారు.

06/24/2017 - 02:53

హైదరాబాద్, జూన్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ 3పగ్గాలు2 ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకూ బలపడుతోంది. తెలంగాణలో వైకాపా బతికి బట్ట కట్టాలంటే షర్మిలనే సరైన నాయకురాలని, ఆమె సారథ్యంలోనే పని చేస్తామని అనేక మంది నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

06/24/2017 - 02:47

హైదరాబాద్, జూన్ 23: పాస్‌పోర్టుల జారీలో భాగంగా త్వరగా పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడంలో ముందున్నందుకు తెలంగాణ పోలీసు శాఖకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గుర్తింపు ప త్రం లభించింది. ఢిల్లీలో జరిగిన పాస్‌పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి స్వీకరించారు.

06/24/2017 - 02:46

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గురుకుల పోస్టుల్లో ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు బిసి అభ్యర్థులకు బిసి స్డడీ సర్కిల్‌లో 20 రోజులు ఉచిత క్రాష్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు బిసి సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

06/24/2017 - 02:44

హైదరాబాద్, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ‘తెలుగు వారి జ్ఞాపకం’ పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు మ్యూజియంను నిర్మించాలని ఎన్‌టిఆర్ ట్రస్ట్ సంకల్పించిందని ట్రస్ట్ సిఈఓ టి.విష్ణువర్థన్ తెలిపారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాలను తయారు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన శిల్ప కళాకారులకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ భావిస్తోందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

06/24/2017 - 02:44

హైదరాబాద్, జూన్ 23: పదవీ విరమణ చేసిన అధికారులను కొనసాగించరాదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన వారిని ఒఎస్‌డిలుగా, ప్రభుత్వ సలహాదారులుగా సుమారు రెండు వేల మంది ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే పదవీ విరమణ చేసిన వారిని కొనసాగించడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు.

Pages