S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/11/2020 - 07:25

హైదరాబాద్/సికిందరాబాద్, మార్చి 10: ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అనేక దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్ (కరోనా) వ్యాధిని నగరంలోని గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేశారు. రాష్ట్రంలో నిర్ధారణ అయిన ఒకే ఒక్క కేసుకు అధునాతనమైన చికిత్సను అందించి గాంధీ వైద్యులు తమ వృత్తి నైపుణ్యం చాటుకున్నారు. దీంతో నగరంలో ఇక కరోనా వైరస్ లేనట్టేనని చెప్పవచ్చు.

03/11/2020 - 07:23

హైదరాబాద్, మార్చి 10: కరోనావైరస్ నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా కార్పొరేట్ ఆసుపత్రి ‘యశోదా’ యాజమాన్యం రెండు లక్షల మాస్కులను అందిస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌తో యశోదా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, వైస్-ప్రెసిడెంట్ సురేష్ కుమార్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. రాష్ట్రం కరోనా బారిన పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యశోదా ప్రతినిధులు శ్లాఘించారు.

03/11/2020 - 07:22

హైదరాబాద్, మార్చి 10: కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందితో టీ-సాట్ స్టూడియో నుండి మంగళవారం ఆరోగ్య కుటుంబ శాఖ ఉన్నతాధికారులు మాట్లాడారు.

03/11/2020 - 07:29

హైదరాబాద్, మార్చి 10: ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలైన భారత్, అమెరికా మధ్య ఉన్న మంచి సంబంధాలు ఇరుదేశాల అభివృద్ధికి, ప్రపంచ శాంతికి సహకరిస్తాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన అమెరికా కాన్సులేట్ నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న నూతన కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి సంబందించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

03/11/2020 - 07:16

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ బడ్జెట్‌ను చూస్తే వాస్తవికతను దాచి, భూములు, ప్రభుత్వ ఆస్తులు, మద్యం అమ్మకం ద్వారానే వచ్చే ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని బడ్జెట్‌ను రూపొందించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రూ. 1.82లలక్షల కోట్లకు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే, అప్పుల ద్వారా రూ. 30వేల కోట్లు, పనే్నతర ఆదాయం రూ.

03/11/2020 - 07:14

హైదరాబాద్, మార్చి 10:కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమానికి కేటాయించిన నిధులు సంబంధిత ఇతర పనులకు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి డి. దివ్య పేరుతో మంగళవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 14) జారీ అయింది.

03/11/2020 - 07:14

హైదరాబాద్, మార్చి 10: టీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలకు చెక్‌పెడాతామని, బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే కుట్రతో వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రప్రభుత్వం దోపిడీకి పాల్పడితే వాచ్‌డాగ్‌లా వ్యవహరిస్తామన్నారు.

03/11/2020 - 01:39

హైదరాబాద్: రాజ్యసభ, శాసనమండలి అభ్యర్థుల ఎంపికకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ, శాసనమండలికి రెండేసి ఖాళీలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ రెండింటికీ ఖరారు చేసిన అభ్యర్థులను బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.

03/11/2020 - 01:38

సంగారెడ్డి: వలసల నివారణ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఒక్కసారిగా స్తంభించనున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ క్షేత్ర సహాయకులు (ఎఫ్‌ఏ) ఈనెల 12వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు తెలుస్తోంది.

03/11/2020 - 01:36

హైదరాబాద్: వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రప్రభుత్వం అద్భుతమైన విజయాలను నమోదు చేసిందని సామాజిక ఆర్థిక అవుట్‌లుక్ 2020 ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణలో 2013లో శిశు మరణాల రేటు 92 ఉంటే, 2017 నాటికి 76కు పడిపోయింది. గతంలో పేద మహిళలు కాన్పుల నిమిత్తం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలంటే వెనకాడే పరిస్థితి ఉండేది.

Pages