S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/16/2017 - 03:48

హైదరాబాద్, జనవరి 15: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో సుమారు రూ. 34 లక్షలు విలువ చేసే బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. జెద్దా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి ఆరు బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు ముంబయి వాసిగా గుర్తించారు. అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

01/16/2017 - 03:47

హైదరాబాద్, జనవరి 15: తింటే హైదరాబాద్ బిర్యానీ తినాలని అంటుంటారు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ ఛాయ్ బాగా పేరిన్నికగన్నాయి. మరోవైపు హైటెక్ సిటీ, ఐటి, ఫార్మా రంగాల్లోనూ హైదరాబాద్ ప్రఖ్యాతి చెందింది. తాజాగా దేశంలో అతి పెద్ద మద్యం దుకాణం ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే వెలిసింది. ఇటీవల బంజారాహిల్స్‌లో ఈ భారీ స్థాయి మద్యం దుకాణం ప్రారంభమైంది.

01/16/2017 - 03:46

హైదరాబాద్, జనవరి 15: మూసి వేసిన వంద వసతి గృహాలను వెంటనే తెరిపించకపోతే ఆందోళన బాట పడతామని, ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని 12 బిసి సంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో ఈ ఏడాది 59 ఎస్‌సి వసతి గృహాలను, 35 బిసి వసతి గృహాలను, 6 ఎస్‌టి వసతి గృహాలను ప్రభుత్వం మూసి వేసిందని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.

01/16/2017 - 03:40

హైదరాబాద్, జనవరి 15: రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచినీటి కోసం కృష్ణా జలాలపై ఆధారపడిన 35కుపైగా పట్టణాలు రానున్న వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం కనపడుతోంది. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు మంచినీటి వినియోగ ప్రణాళికకు ఈ నెలాఖరులో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

01/16/2017 - 03:39

హైదరాబాద్, జనవరి 15: యువత పాశ్చాత్య మోజులో పడిపోయి మన సంస్కృతిని, మన పండుగలను మరిచిపోతోందని పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను విడనాడకూడదని ఆయన యువతకు ఉద్బోధించారు.

01/16/2017 - 03:37

హైదరాబాద్, జనవరి 15: రాష్టవ్య్రాప్తంగా కలకలం సృష్టించిన హైదరాబాద్ శివారులోని బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ చోరీ వెనుక ముంబయి మాఫియా డాన్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ముత్తూట్ చోరీ సూత్రధారి లక్ష్మణ్‌తోపాటు ఐదుగురు నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు ఇటీవల కర్నాటకలోని గుల్బర్గాలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

01/16/2017 - 03:36

హైదరాబాద్, జనవరి 15: చరఖా ముందు కూర్చున్నంత మాత్రాన మహాత్మా గాంధీ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు ఆమోదించరని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు, ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, ఎపి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి మాజీ అధ్యక్షుడు జి. నిరంజన్ అన్నారు.

01/16/2017 - 02:40

హైదరాబాద్, జనవరి 15: ఈనెల 17న హెచ్‌సియూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ప్రథమ వర్ధంతిని నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. హెచ్‌సియూలో గత సంవత్సరం 17వ తేదీన విద్యార్థి రోహిత్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా విద్యార్థి రోహిత్ వర్ధంతి సందర్భంగా మంగళవారం హెచ్‌సియూ, ఓయూలో దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

01/16/2017 - 02:40

హైదరాబాద్, జనవరి 15: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తూ కొత్తగా రాష్ట్ర జియోగ్రాఫిక్ ఇన్ఫ్‌ర్‌మేషన్ సిస్టమ్ (జిఐఎస్)ను ఆవిష్కరించేందుకు సన్నాహాలుచేస్తోంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ బృహత్తర ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుకు సమాచార టెక్నాలజీ శాఖ సాంకేతిక సహాయాన్ని అందించనుంది.

01/16/2017 - 02:39

హైదరాబాద్, జనవరి 15: హజ్ యాత్రీకుల తెలంగాణ కోటా ఈసారి పెరిగినట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. గత సంవత్సరం హజ్ యాత్రీకుల కోటా లక్షా 36వేలు కాగా, ఈసారి లక్షా 70వేలకు పెరిగినట్టు చెప్పారు. లక్షా 70వేల నుంచి రెండు లక్షల కు పెంచాలని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీని కోరినట్టు చెప్పారు.

Pages