S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/01/2016 - 07:27

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షకు హాజరయ్యే మాట- వినికిడి లోపం ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ ఆధ్యర్యంలోని ‘మనటీవీ’ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సిఇఓ ఆర్ శైలేష్‌రెడ్డి చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బుధవారం నాడు సూచనలు-సలహాలు ప్రసారం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

11/01/2016 - 07:01

హైదరాబాద్, అక్టోబర్ 31: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందడంతో వైద్య ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సచివాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

11/01/2016 - 07:01

మహబూబ్‌నగర్, అక్టోబర్ 31: కెసిఆర్‌ది కోతిబలమని పిచ్చికోతి చెట్టెక్కి కల్లు తాగితే అదే తన సొంత బలమని భావిస్తుందని.. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా కోతిబలం మాదిరే వ్యవహరిస్తున్నారని.. ఆయనది సింహబలం కానేకాదని తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటకు చేరుకుంది.

11/01/2016 - 07:00

హైదరాబాద్, అక్టోబర్ 31: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితి శిశుపాలుని మాదిరిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ మాజీ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వంద అబద్దాలు ఆడారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయకపోవడంతో సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

11/01/2016 - 06:59

హైదరాబాద్, అక్టోబర్ 31: మూడవ దశ మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్‌లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. మిషన్ కాకతీయ-1, మిషన్ కాకతీయ-2లో చేపట్టిన పనులు, ఫలితాలలను మంత్రి సమీక్షించారు.

11/01/2016 - 06:57

హైదరాబాద్, అక్టోబర్ 31: ‘నిజమే, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అవినీతి, అక్రమాల్లో దేశంలో నెంబర్-1గా నిలిచారు..’ అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఏమి చేశారని దేశంలో కెసిఆర్ నెంబర్-1 అయ్యారని ఆయన సోమవారం పార్టీ నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కి, జగ్గారెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు.

11/01/2016 - 06:55

గద్వాల, అక్టోబర్ 31: జోగులాంబ గద్వాల జిల్లా తెరాస కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగారు. పిజెపి అతిథిగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో జిల్లా నాయకుల మధ్య గత కొంతకాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

11/01/2016 - 06:47

ఖమ్మం, అక్టోబర్ 31: నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇటీవలి మలిదశ ఉద్యమం వరకు ప్రజల్ని చైతన్యపర్చి ఉద్యమబాట పట్టించడంలో ఇక్కడి ప్రజలదే ముందుబాట. కానీ నేడు డెంగ్యూ జ్వరాలతో బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే మిగిలిన వారు వలసబాట పడుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం నెలరోజులుగా డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతోంది. నెలరోజుల్లో 22 మంది డెంగ్యూతో మృతి చెందారంటే పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థవౌతుంది.

11/01/2016 - 06:36

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాల కూల్చివేత.. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్య జనం మధ్య ‘హాట్ హాట్ టాపిక్’గా మారింది. దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తెలంగాణ సచివాలయం పాత భవనాల వెల ప్రస్తుత ధరల ప్రకారం ఎంత? అన్న ప్రశ్న వస్తోంది. వీటి ధర 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.

11/01/2016 - 06:33

అమరావతి/ఏలూరు, అక్టోబర్ 31: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యాన్ని వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పవన్ ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయిలో మకాం మార్చనున్నారు. ఈమేరకు ఆయన తన పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. సోమవారం తనను కలసిన జనసేన నేతలు, అభిమానులతో పవన్ ముచ్చటించారు.

Pages