S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

10/05/2016 - 06:21

హైదరాబాద్, అక్టోబర్ 4: జిల్లాలు, మండలాల పునర్విభజనపై చెలరేగిన ఆందోళనల మంటలు ఆరడం లేదు. ‘ప్రజాభీష్టం మేరకే జిల్లాలు, మండలాల పునర్విభజన చేస్తాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెబుతున్నా, కొత్తగా గద్వాల, అసిఫాబాద్ వంటి జిల్లాలను పెంచేందుకు అంగీకరించినా ఇంకా ఆందోళనలు, ఒత్తిళ్ళు పెరుగుతూనే ఉన్నాయి. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్‌పిటిసీలు, ఇతర నాయకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

10/05/2016 - 05:47

కొత్తగూడెం, అక్టోబర్ 4: కోల్‌కతాలో మంగళవారం జరిగిన జాయింట్ బై పార్టెడ్ కమిటీ ఆఫ్ కోల్ ఇండస్ట్రీ (జెబిసిసిఐ) సమావేశంలో బొగ్గు గని కార్మికులకు రూ.54 వేలు దీపావళి బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం జరిగిన సమావేశంలో జాతీయ కార్మిక సంఘాలు రూ.60వేల బోనస్‌ను డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల అనంతరం రూ. 54 వేలకు అంగీకారం కుదిరింది.

10/05/2016 - 02:10

చిట్యాల, అక్టోబర్ 4: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలోని గర్భాలయంలో ఉన్న స్వామివారి ప్రతిమ పాదాలను మంగళవారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయంలోని గర్భాలయంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణస్వామి ప్రతిమ స్వామి వారి పాదాలను సూర్య కిరణాలు తాకడంతో భక్తుల ఈ సుందర దృశ్యాన్ని దర్శించి వీక్షించేందుకు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు.

10/05/2016 - 02:08

హైదరాబాద్, అక్టోబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యులు కె కేశవరావు నేతృత్వంలో ఏర్పాటైన హై పవర్ కమిటీ మంగళవారం సమావేశమైంది. గద్వాల, సిరిసిల్ల, జనగాం, అసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు హైపవర్ కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నాలుగు జిల్లాలపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. మండలాలు, మిగిలిన జిల్లా ల ఏర్పాటు కోసం వచ్చిన వినతి పత్రాలను పరిశీలిస్తున్నారు.

10/05/2016 - 02:06

సూర్యాపేట, అక్టోబర్ 4: రాష్టస్థ్రాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన సి.రాహుల్ కైవసం చేసుకొని మిస్టర్ తెలంగాణ-2016గా నిలిచారు. సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 300 మంది బాడీబిల్డర్లు హాజరయ్యారు.

10/05/2016 - 02:04

సంగారెడ్డి, అక్టోబర్ 4: మహారాష్ట్ర, కర్నాటకలో మంజీర నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మంజీర నదికి మళ్లీ వరద పోటెత్తింది. సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 78 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్‌లోకి వదిలిపెడుతున్నారు. 2 మీటర్ల ఎత్తులో ఏడు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.

10/05/2016 - 02:02

కోదాడ, అక్టోబర్ 4: పరిశుభ్రతను పాటించే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభు త్వం స్వాస్థ అభియాన్ కింద కాయకల్ప కార్యక్రమం ద్వారా నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్, కాయకల్ప కార్యక్రమ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ ఎ. ప్రభావతి ప్రకటించారు. కోదాడ క మ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంగళవారం సాయంత్రం సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

10/05/2016 - 01:59

భద్రాచలం, అక్టోబర్ 4: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో మూడోసారి గోదావరికి వరదలు రావడంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేయడంతో భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం నాటికి 37 అడుగులకు వరద నీటిమట్టం పెరిగింది.

10/05/2016 - 01:58

హైదరాబాద్, అక్టోబర్ 4: రైతులను భాగస్వామ్యం చేస్తూ రాష్టవ్య్రాప్తంగా గిఫ్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విధానం దేశవ్యాప్తంగా సత్ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో చాలా నగరాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో నగరం, పట్టణాల చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములను తీసుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయడానికి అభివృద్ధి చేస్తున్నారన్నారు.

10/05/2016 - 01:58

మహబూబ్‌నగర్, అక్టోబర్ 4: రాష్ట్రం లో చేపల పెంపకానికి బడ్జెట్‌లో రూ.101 కోట్లు కేటాయించామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు.

Pages