-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కాన్పూర్ సెంట్రల్- లక్నోల మధ్య బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ స్తంభన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తూ..మరి కొన్ని రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లింపును చేపట్టింది. ట్రైన్ నెం.15024 యశ్వంత్పూర్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ను నవంబర్ 12, 19, 26, డిసెంబర్ 3వ, తేదీల్లో రద్దు చేసినట్టు రైల్వే తెలిపింది.
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు మోహన్బాబు శనివారం సాయంత్రం తన కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి లేక్వ్యూ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీంకు అనుచరుడైన కట్టా శివను బీడీ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు శనివారం మెట్పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం శివకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం శివను జగిత్యాల జైలుకు తరలించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 13 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులుతెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల జల్లులు పడుతున్నాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం 13 నాటికి బలపడుతుందని, ఉత్తర తెలంగాణలో అధికంగా వర్షాలు పడతాయన్నారు.
హైదరాబాద్:నగరంలోని శనివారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసి రహదారులు జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్: ఈ నెల 12న గజ్వేల్లో మల్లనసాగర్ రైతులకు మద్దతుగా సభ నిర్వహిస్తామని, అదేరోజు గవర్నర్ను కలుస్తామని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. వేములఘాట్లో రైతుల దీక్షకు 100 రోజులైన సందర్బంగా గజ్వేల్లో సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 19, 20న కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, దిగ్విజయ్, రాజకీయ నిపుణులు హాజరవుతారని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ 3 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే గడువు శుక్రవారం అర్ధరాత్రి ముగిసినప్పటికీ శనివారం సాయంత్రం 5గంటల వరకు డౌన్లోడ్ చేసుకొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.
హైదరాబాద్: శనివారం ఉదయం నగరంలోని సైదాబాద్, అంబర్ పేట, కోఠి, నాంపల్లి, జూబ్లీహిల్స్, లక్డికాపూల్, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లిలో భారీ వర్షం పడింది. పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది.
హైదరబాద్, సెప్టెంబర్ 9: వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ తరానికి అన్యాయం జరిగినా ముందు నిలిచి పోరాడిన ప్రజాకవి కాళోజి నారాయణరావు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గీతాంజలి కావ్యాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ను విశ్వకవిగా ప్రశంసించారని, అలాగే విశ్వ కవి కాళోజి అని ఆయన అభివర్ణించారు.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 9: పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. ఎంజికెఎల్ఐలోని మూడు లిప్టుల్లో మొదటి లిప్టులలోని ఐదు మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తూ కిందికి వదులుతున్నారు.