-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 9: పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలు గ్రామాలకు చేరుతుండటంతో ప్రజలలో ఆనందం నెలకొంది. పైనుంచి కాలువల ద్వారా వస్తున్న నీటిని జొన్నలబొగుడ రెండో లిప్టులోని మొదటి పంపుతో నీటిని పంపింగ్ చేస్తూ జొన్నలబొగుడ రిజర్వాయర్ను నింపి కాలువల ద్వారా కిందికి వదులుతున్నారు.
గజ్వేల్, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెసోళ్ల్లు కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.
కొత్తగూడెం, సెప్టెంబర్ 9: సింగరేణి సంస్థలో బిసిలకు అమలు జరుగుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్పై ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ బిసి సంక్షేమ కమిటీ సమీక్ష నిర్వహించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: హైదరాబాద్ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 11.95 లక్షలు నగదు, ఓ బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్కడి రైతులు వేములగట్లో వంద రోజులుగా దీక్ష చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ రైతులకు మద్దతుగా ఈ నెల 12న గజ్వేల్లో సభ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
భువనగిరి, సెప్టెంబర్ 9: హత్యకేసులో నలుగురు ముద్దాయిలకు అయిదవ అదనపు సెషన్స్ జడ్జి సి.పి.విందేశ్వరి జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.
జగిత్యాల, సెప్టెంబర్ 9: నరుూం ఎన్కౌంటర్ అనంతరం సిట్ బృందం చేపట్టిన విచారణలో అతనితో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తూ కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వైఎస్ఆర్సిపి యువనేతను జగిత్యాలలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. ఈ సంఘటన జగిత్యాలలో శుక్రవారం కలకలం సృష్టించింది.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 9: జిల్లాల పునర్విభజన సెగలు ఆదిలాబాద్ జిల్లాలో వేడిపుట్టిస్తూనే ఉన్నాయి. వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాను ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆనాలోచితంగా మూడు జిల్లాలుగా విభజించడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్లో తెలంగాణ తొలి ఉద్యమకారులు శుక్రవారం రిలే దీక్షలు చేపట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: గ్యాంగ్స్టర్ నరుూం ఎన్కౌంటర్ అనంతరం అతని అనుచరులు ఒక్కొక్కరుగా ఊచలు లెక్కబెడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య అనుచరులను అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా శుక్రవారం కృష్ణమూర్తి అలియాస్ కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కృష్ణారావుకు ముంబై, హైదరాబాద్ శివారుల్లో ఖరీదైన ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ పర్యాటక ప్రాంతాల గురించి అన్ని దేశాల్లోనూ ప్రచారం నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పర్యాటక రంగంపై ప్రచారం కోసం రోడ్ షో నిర్వహించారు.