-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
ఖమ్మం, సెప్టెంబర్ 8: ఖమ్మం జిల్లాలో తొలిసారి ఈవిఎంల ద్వారా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మూడు స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లాలో గురువారం మూడు సర్పంచ్ స్థానాలకు, ఏడు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించింది.
డిచ్పల్లి, సెప్టెంబర్ 8: ఆడుకుంటూ వెళ్లి నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బోరుబావిలో పడిపోయిన ఓ చిన్నారిని తండావాసులు ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడడంతో బాలుడు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటన గురువారం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గౌరారంతండాలో జరిగింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల విభజన పలుచోట్ల అధికారపక్ష సభ్యులకు సైతం తలనొప్పిగా మారింది. జనగామ జిల్లాను చేయాలని పెద్దఎత్తున ఆందోళన జరుగుతోంది. జనగామలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన సాగుతుండడంతో టిఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: జిల్లాల పునర్ విభజన జిఎస్టిపై ఎటువంటి ప్రభావం చూపదని రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు. జిఎస్టి అమలు కోసం ప్రభుత్వ సిబ్బందికి కంప్యూటర్లపై పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టినట్టు అయన అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8: గ్యాంగ్స్టర్ నరుూం కేసులో ఐదుగురు నిందితులు గురువారం హయత్నగర్ కోర్టులో లొంగిపోయారు. నరుూం అనుచరులు మరో ఐదుగురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించగా చర్లపల్లి జైలుకు తరలించారు.
మహబూబ్నగర్ : కాంగ్రెస్ హయాంలో హంద్రీ నీవా, కల్వకుర్తికి ఒకేసారి శంకుస్థాపన చేసినప్పటికీ- కల్వకుర్తిని మాత్రం పట్టించుకోలేదని నీటిపారుదల శాఖమంత్రి టి. హరీష్రావు అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్-2ను హరీష్ గురువారం ప్రారంభించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో 50 శాతం పనులే జరిగాయని, సీఎం కేసీఆర్ పట్టుదలతోనే లిప్టు పనులు పూర్తయ్యాయన్నారు.
హైదరాబాద్ : అధిక వడ్డీలు వసూలు చేస్తున్న శ్రీనివాస్, వీరేశం అనే వ్యక్తులను గురువారం నాచారంలో పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్, వీరేశంల నుంచి రూ. 56.20 లక్షల నగదు, 9.26 కోట్ల విలువైన 150 చెక్కులు, 93 సేల్ డీడ్లు, 2 మొబైల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో A10 నిందితుడిగా ఉన్న సుధాకర్, A11 రాపాటి వెంకటేష్ గౌడ్, A12 నిందితుడుగా ఉన్న రాపాటి కరుణాకర్, A13 దోరనాల శ్రీను, A14 శ్రీధర్ రాజు గురువారం హయత్నగర్ కోర్టులో లొంగిపోయారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలకు నయీంతో సంబంధాలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఖమ్మం : చర్లలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిరమణ సమక్షంలో మావోయిస్టులు వేకో జోగా, అతని భార్య నూప పాయికేలు గురువారం లొంగిపోయారు. లొంగిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నారు.
మెదక్ : ఈనెల 17న వరంగల్లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో గురువారం జరిగిన బీజేపీ తిరంగా యాత్ర కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మజ్లీస్కు భయపడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా నిర్వహించడం లేదని అన్నారు.