-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 7: గ్యాంగ్స్టర్ నరుూం కేసులో అనేక అకృత్యాలు వెలుగుచూస్తున్నాయి. నరుూం ఎన్కౌంటర్ అనంతరం అతని ఇంట్లో ఉన్న మైనర్ బాలికలను స్టేట్ హోంకు రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం వారిని విచారించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: ఆ కార్యాలయం నుంచి ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు... ఎందుకనుకుంటున్నారా?... సునామీ లేదా భూకంపం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తొక్కిసలాట జరగకుండా ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేసుకుంటూ ప్రమాదం నుంచి బయటపడాలో తెలియజేసేందుకు ‘మాక్ డ్రిల్’ నిర్వహించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: మెదక్ జిల్లాలో నిమ్జ్, హైదరాబాద్లో ఫార్మాసిటీ, వరంగల్లో టెక్స్టైల్ పార్క్తోపాటు రాష్ట్రంలో నెలకొల్పనున్న డ్రైపోర్టుల మాస్టర్ ప్లాన్, వౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: జిల్లాల పునర్విభజన ముసాయిదాలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపించటం లేదు. కొత్త జిల్లాలకు నిధుల కేటాయింపు అంశంతో పరోక్షంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
మహబూబ్నగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యే భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కోడూరులో బుధవారం జరిగింది. తీవ్ర గాయాలకు లోనైన ఆ భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిద్రిస్తున్న భర్త రాముపై భార్య గంగమ్మ కిరోసిన్ కుమ్మరించి నిప్పంటించింది. దీంతో రాము సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యుత్తమ పద్ధతులను మార్కెటింగ్ శాఖలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు సింగిల్ లెవీ, సింగిల్ లైసెన్స్ విధానాలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు .పేర్కొన్నారు.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కువైట్కు వెళ్లే ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యమైంది. ప్రయాణికుడు రవిబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హైదరాబాద్: మిర్చి రసం తాగించి.. గ్యాంగ్స్టర్ నయీం తమను లైంగికంగా వేధించేవాడని, తమపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలికలు పోలీసుల విచారణలో బుధవారం తెలిపారు. నయీం ఇంట్లోని బాలికలను సాక్షులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. నయీం తమపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ తర్వాత మెడిసిన్స్ ఇచ్చేవాడని బాలికలు విచారణలో విలపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపాదిత జిల్లాలతో కలిపి 27 జిల్లాలు ఉండగా, హైదరాబాద్ మినహా 26 జిల్లాలకు రూ.26 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపాదిత జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంతో పాటు పాత జిల్లాల్లో సదుపాయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది.
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నరుూం అనుచరుడైన శ్రీహరితో కలిసి ఆదిభట్ల ప్రాంతంలో భూకబ్జాలకు పాల్పడిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై ‘సిట్’ అధికారులచే సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బుధవారం డిజిపి అనురాగ్శర్మకు వినతిపత్రం అందజేశారు. మంచిరెడ్డి భూకబ్జాలకు సంబంధించి తగిన ఆధారాలున్నాయని ఆయన తెలిపారు.