S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/07/2016 - 13:09

హైదరాబాద్: 2011లో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు అక్బరుద్దీన్‌ బుధవారం కోర్టుకు వచ్చారు. నిన్న ఈ కేసుపై జరిగిన విచారణలో తనపై జరిగిన హత్యాయత్నం తీరును ఆయన న్యాయస్థానానికి వివరించారు. మహ్మద్‌ పహిల్వానతో పాటు మరో 12 మంది నిందితులు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. పహిల్వాన్‌తో పాటు, మరో ముగ్గురిని అక్బర్‌ గుర్తించారు.

09/07/2016 - 12:49

సికింద్రాబాద్‌ : రైలు నిలయం సమీపంలో బుధవారం ఉదయం తార్నాక-ఉప్పల్‌ వైపు వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తూ రైల్యే నిలయం సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై వున్న టీ స్టాల్‌, చెరుకురసం బండి, పాన్‌ డబ్బాలను ఢీకొట్టింది. పక్కనే ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొట్టడంతో ఆగింది. తెల్లవారు జామున జనసమ్మర్థం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

09/07/2016 - 04:41

జగిత్యాల, సెప్టెంబర్ 6: ఆ గడీ ఒకప్పటి జమీందారీ వ్యవస్థకు చిహ్నం.. రాచరికపు రాజసనానికి, గత వైభవానికి గుర్తు... అయతే అలాంటి వాటిని కొంతమంది వారసులు కూల్చివేసి ప్లాట్లుగా విక్రయంచుకుంటున్న తరుణంలో... పూర్వీకుల వారసత్వ సంపదను ఆలయంగా తీర్చిదిద్ది ఆదర్శప్రాయంగా నిలిచారు దేశముఖ్ వారసులు. తమ దాతృత్వంతో ఊరి మొత్తానికి ఆధ్యాత్మిక శోభ చేకూర్చారు.

09/07/2016 - 04:38

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ప్రజాసమస్యలపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) సమరశంఖం పూరించింది. ఇప్పటికే వివిధ అంశాలపై ఆందోళనలు, సదస్సులు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా రైతాంగ సమస్యలపై 2016 అక్టోబర్ 2 న హైదరాబాద్‌లో ఒకరోజు వౌనదీక్ష చేపట్టాలని టిజాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నిర్ణయించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని విపక్షాలతో ఆయన చర్చలు జరుపుతున్నారు.

09/07/2016 - 04:49

మెదక్ రూరల్, సెప్టెంబర్ 6: తీవ్ర వర్షాభావంతో వందలకొలది అడుగుల లోతు బోరు డ్రిల్ వేసినా చుక్కనీరు రాని పరిస్థితుల్లో గుడి నిర్మాణం కోసం పిల్లర్ గుంత తవ్వుతుండగా ఆరడుగుల లోతులో బండరాయి నుండి నీరు ఉబికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలం ఖాజిపల్లి శివారులో గల కాలభైరవస్వామి దేవాలయం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...

09/07/2016 - 04:52

కరీంనగర్/వరంగల్/ఆదిలాబాద్, సెప్టెంబర్ 6: ఓ వైపు కొత్త జిల్లాల ప్రక్రియ వేగంగా జరుగుతుంటే.. మరోవైపు నిరసనల హోరు కూడా అదే జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజనపై వివిధ జిల్లాల్లో నిరసనల హోరు రోజురోజుకూ ఉధృతమవుతోంది.

09/07/2016 - 04:32

హైదరాబాద్, సెప్టెంబర్ 6: గ్యాంగ్‌స్టర్ నరుూంతో సంబంధాలు కలిగివున్నట్టు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. దమ్ముంటే..తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం చౌరస్తాను వేదికగా ప్రకటించారు.

09/07/2016 - 04:32

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు జారీ చేసిన ముసాయిదాపై ప్రజల స్పందన, అధికారుల కసరత్తు ఆధారంగా చేర్పులు, మార్పులు చేసి తుది నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

09/07/2016 - 04:29

హైదరాబాద్, సెప్టెంబర్ 6: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూంకు ఆయుధాలు సరఫరా చేసిన వారిని సిట్ గుర్తించింది. నరుూం డ్రైవర్ శ్రీ్ధర్‌గౌడ్‌తోపాటు మరో ఇద్దరు నరుూంకు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చారని సిట్ అధికారులు గుర్తించారు.

09/07/2016 - 04:28

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 6: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఆరుతడి పంటలకుగాను ఎడమకాల్వ ద్వారా విడదల చేస్తున్న నీటిని డ్యాం అధికారులు సోమవారం అర్ధరాత్రి నిలిపివేశారు. ఈసందర్భంగా ప్రాజెక్టు సిఇ సునీల్ మాట్లాడుతూ ముందుగా ప్రకటించినట్లుగా ఆరుతడి పంటలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని, మొదటి విడుతగా 12 రోజులు విడుదల చేశామని ఆయన తెలిపారు.

Pages