-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
కరీంనగర్, సెప్టెంబర్ 4: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు నేరాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులకు కంటి మీద కనుకులేకుండా చేస్తున్న మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు నేరగాళ్లపై కరీంనగర్ జిల్లా పోలీసులు పిడి యాక్టు ప్రయోగించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: ‘టిఆర్ఎస్ నేతలను గద్దె దించండి, టిఆర్ఎస్ జెండా దిమ్మెలను పగుల గొట్టండి..’ అని తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల పేరిట జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరాదని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 31 మంది పాఠశాల స్థాయి ఉపాధ్యాయులను ‘ఉత్తమ ఉపాధ్యాయులు’గా ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రకటించారు. భారత మాజీ రాష్టప్రతి సర్వేపల్లి రాధకృష్ణన్ జన్మదినోత్సవమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులను గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది.
కురవి, సెప్టెంబర్ 4: అన్ని తానై పెంచే తల్లులను చూస్తుంటాం.. కానీ లోకం తెలియని వయస్సులో ఆ చిన్నారి చంటి బిడ్డ... రోగాన పడ్డ తల్లి కోసం పడిన తాపత్రయం చూస్తే ఎవరికైనా కళ్లు చమర్చక మానవు. నాలుగు నెలలుగా ఇంటింటికీ వెళ్లి అన్నం అడిగి మరి తల్లి ఆకలి తీర్చి.. ఆ అమ్మకు అమ్మైంది. ఆదివారం తెల్లవారుజామున ఆ తల్లి మృతిచెందింతే ఏమి జరిగిందో తెలియదు.. అమ్మ లేవదు.. చనిపోయిందంటే అసలు తెలియదు...
హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడిచి పోయినా ఇంకా ఉద్యోగుల బదిలీ, రెండు రాష్ట్రాల మధ్య పలు కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లో ఆస్తుల బదిలీ వంటి సమస్యలు తీరనే లేదు. జిల్లాల పునర్విభజనతో కొత్త జిల్లాలకు ఇలాంటి సమస్యలు ఎదురు కానున్నాయి. ఒక్కో జిల్లా రెండు నుంచి మూడు జిల్లాల వరకు అవుతోంది. హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలు సగటున ఒక్కో జిల్లా మూడు జిల్లాలు అవుతోంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటులో చోటు దక్కని జిల్లాల కోసం రాజుకున్న నిరసన గళం రోజురోజుకు బలపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటును అన్ని రాజకీయ పక్షాలు స్వాగతిస్తూనే ప్రతిపాదిత జిల్లాల ముసాయిదా అశాస్ర్తియంగా ఉందని విపక్షాలు ఎండగడుతున్నాయి. ప్రతిపాదిత జిల్లాలపై విపక్షాలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన గళం వినిపించడం పాలకపక్షాన్ని ఇరకాటంలో పడేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: కొనే్నళ్లుగా పెద్దగా ఉపయోగంలో లేని రాష్ట్ర ప్రభుత్వ టీవి చానళ్లను, మనటీవీని నూతన పోకడలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మనటీవీని పూర్తిగా మార్చనున్నట్టు ఐటి శాఖ మంత్రి కెటిఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్ర్తియత లేదని ఈ అంశాన్ని జ్యుడిషీయల్ కమిషన్కు అప్పగించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల ముసాయిదాను ప్రజల ముందు పెట్టాలని, గిరిజన జిల్లాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: సోమవారం నుంచి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నగరమంతా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవల పట్టుబడిన ఐసిస్ ఉగ్రవాదుల సానుభూతిపరుల సమాచారం మేరకు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర జరగొచ్చనే అనుమానాలతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ప్రత్యేక వైమానిక దళాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 3: కా శ్మీర్లో అంగుళం భూమి వదులుకోవడానికి 125 కోట్ల భారతీయులు సిద్ధం గా లేరని, పాక్ ఉగ్రవాద సం స్థల ప్రేరేపితంతోనే కాశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నాయని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థల కార్యక్రమాలు భారత్లో చెల్లవని భారత సైనికులు ఎప్పటికప్పుడు రుజువుచేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహయమంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్ అన్నారు.