S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/24/2016 - 11:22

సికింద్రాబాద్ : ఉప్పల్లో సాయికుమార్, విజయ్‌కుమార్ అనే ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమైన సంఘటన బుధవారం వెలుగుచూసింది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు తిరిగి ఇంటి్కి రాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

08/24/2016 - 08:45

హైదరాబాద్, ఆగస్టు 23: ‘మహా’ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు ప్రాజెక్టులపై ఒప్పం దం చేసుకుంటున్న సమయంలోనే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.

08/24/2016 - 08:45

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుదుర్చుకున్న ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. పాలక, ప్రతిపక్షాల నేతలు ఈ విధంగా స్పందించారు.
ఇది కెసిఆర్ రచించిన మరో చరిత్ర

08/24/2016 - 08:44

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 23: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాగునీటి ఒప్పందం యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేదిగా ఉందని ఎమ్మెల్యే డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాగునీటి ఒప్పందాలను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిపారు.

08/24/2016 - 08:43

కరీంనగర్ టౌన్, ఆగస్టు 23: తెలంగాణ రైతాంగం ఆత్మాభిమానాన్ని మహారాష్టక్రు తాకట్టు పెట్టి, మేడిగడ్డ నిర్మాణం కోసం చేసుకుంటున్న మహా ఒప్పందాన్ని కాంగ్రెస్ అధికారంలోకొస్తే పునఃపరిశీలిస్తుందని ఆపార్టీ శాసనసభాపక్ష ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు.

08/24/2016 - 08:42

కరీంనగర్/మహబూబ్‌నగర్/ ఆదిలాబాద్/ ఆగస్టు 23: ప్రభుత్వం విడుదల చేసిన జిల్లాల ముసాయిదాపై కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబా ద్ జిల్లాల్లోని ప్రలు ప్రాంతాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ముసాయిదాలో కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల పేరు లేకపోవడంతో ఆ నియోజకవర్గం ప్రజలు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.

08/24/2016 - 08:41

షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 23: గ్యాంగ్‌స్టర్ నరుూం భార్య, అక్క, వాచ్‌మెన్ దంపతుల పోలీస్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జైలుకు తరలించారు.

08/24/2016 - 08:40

లింగాల, ఆగస్టు 23: స్వరాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన కృష్ణా పుష్కరాలు ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన సరళికి అనుగుణంగా అన్ని వర్గాల సమ ష్టి కృషితో చరిత్రలో నిలిచిపోయేలా విజయ వంత మయ్యాయని పం చాయతీరాజ్‌శాఖ మంత్రి జూ పల్లి కృష్ణారావు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు రోజున మంగళవారం సోమశిల విఐపి ఘాట్‌లో ఆయన పుణ్యస్నానమాచరించి గంగపూజను నిర్వహించా రు. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు.

08/24/2016 - 08:17

హైదరాబాద్, ఆగస్టు 23: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందాలు కుదరడంతో ప్రాజెక్టులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని ప్రభుత్వం సంబురాలు జరుపుతోంది. మహారాష్టల్రో ఒప్పందాలు కుదుర్చుకుని తిరిగి వస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారుల బృందానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

08/24/2016 - 08:16

లీగల్ (కరీంనగర్), ఆగస్టు 23: కరీంనగర్ పట్టణానికి చెందిన కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎఎస్‌ఐ బొబ్బల మోహన్ రెడ్డిని మరో ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా మెజెస్ట్రేట్ ఆయనకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

Pages