S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/01/2016 - 17:02

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైదని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ సోమవారం తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది.

08/01/2016 - 15:46

కరీంనగర్ : ఎంసెట్-2 పేపర్ లీకేజీలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బిజెవైఎం కార్యకర్తలు సోమవారం ఇక్కడ పెద్దఎత్తున ఆందోళన చేశారు. పురపాలక సంఘాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతున్న ప్రాంగణంలోకి ఆందోళనకారులు ప్రవేశించి నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ప్రవేశించి కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.

08/01/2016 - 12:45

నల్గొండ: గొల్లగూడ వద్ద సోమవారం ఉదయం రైలుకింద పడి రమేష్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. చండూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రమేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

08/01/2016 - 12:44

వరంగల్: సిసి కెమెరాలను ధ్వంసం చేసి ఆంధ్రాబ్యాంకు శాఖలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మండల కేంద్రమైన పురవిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు బద్దలుకొట్టి సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. నగదు చోరీ చేయాలని యత్నించినా ఫలితం దక్కలేదు. సోమవారం ఉదయం బ్యాంకును తెరిచిన అధికారులు చోరీకి యత్నం జరిగిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

08/01/2016 - 12:42

హైదరాబాద్: అదుపుతప్పిన లారీ ఓ నర్సరీలోకి దూసుకువెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటన మదీనాగూడలో సోమవారం ఉదయం జరిగింది. కూకట్‌పల్లి నుంచి భెల్‌వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై బీభత్సం సృష్టిస్తూ నర్సరీలోకి దూసుకువెళ్లింది. అక్కడ పనిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

08/01/2016 - 06:30

హైదరాబాద్, జూలై 31 : గోదావరి అంత్యపుష్కరాల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పుష్కరాలకు పెద్దగా ప్రచారం ఇవ్వలేదు. గోదావరి ఆదిపుష్కరాల సమయంలో భారీ ప్రచారం కల్పించినప్పటికీ, వర్షాలు సరిగ్గా లేక నదిలో నీరు లేక భక్తులకు అనేక ఇక్కట్లు ఏర్పడ్డాయి.

08/01/2016 - 06:29

సంగారెడ్డి/గజ్వేల్, జూలై 31: మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు మెదక్ జిల్లా సింగారం గ్రామం ముందుకొచ్చింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో ఆ గ్రామ ప్రజలు ఇందుకు అంగీకరించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేస్తున్న నిర్వాసితులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.

08/01/2016 - 06:28

మహబూబ్‌నగర్, జూలై 31: కర్ణాటక, మహారాష్టల్రో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. జూరాలకు స్థిరంగా వరద కొనసాగుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి సైతం వరద ఉదృతి కొనసాగుతోంది. ఇటు జూరాల, అటు సుంకేసుల డ్యాంల నుండి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతూనే ఉంది.

08/01/2016 - 06:28

వరంగల్, జూలై 31: భారత ప్రధాని మోదీ ఈనెల 7న తెలంగాణ పర్యటన ఖరారైందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో తెలంగాణలో వౌలిక సదుపాయాల కల్పనకు 45 వేల కోట్లు కేటాయించిందన్నారు.

08/01/2016 - 06:27

కరీంనగర్, జూలై 31: ఓ వైపు కరవు..మరోవైపు ఉపాధి లేమి.. వెరసి నిరుద్యోగులు గల్ఫ్ దేశాలే ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలుగా భావిస్తూ ఆ వైపునకు అడుగులేస్తుండగా, అక్కడ కూడా వారికి నిరాశే ఎదురవుతోంది. లక్షల కొద్దీ అప్పులు చేస్తూ గల్ఫ్ అనే ‘ఆశ’ల దారిలో అంతులేని ప్రయాణం చేస్తున్నారు.

Pages