-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో వైస్ చాన్సలర్ల నియామకాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, సిఎం కార్యాలయం నుండి ఎలాంటి ఆదేశాలు తమకు రావడం లేదని, కేవలం మెరిట్ ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని సెర్చ్ కమిటీలో యుజిసి పరిశీలకుడిగా హాజరైన ఒక ప్రొఫెసర్ వెల్లడించారు. ఒక యూనివర్శిటి సెర్చ్ కమిటీ సమావేశానికి హాజరైన యుజిసి నామిని ఒకరు ప్రభుత్వ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూలై 15: ఈ వర్షాకాలంలో హరిత హారంలో భాగంగా 55లక్షల ఈత, తాటి మొక్కలను నాటనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి టి పద్మారావు తెలిపారు. ఈనెల 23న ఎక్సైజ్ ప్లాంటేషన్ డేగా పాటిస్తూ ఈత, తాటి మొక్కలను నాటనున్నట్టు చెప్పారు. పద్మారావు సచివాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తొమ్మిది జిల్లాల్లోనూ ఈ మొక్కలు నాటుతారు.
హైదరాబాద్, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర ప్రణాళిక నివేదికలు ప్రజల ముందు పెట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మకు లేఖ రాశారు.
హైదరాబాద్, జులై 15: తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్, బిజెపిలు అనుబంధ పార్టీలుగా మారాయని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక కాంగ్రెస్-బిజెపిల అవసరం తెలంగాణకు లేదని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నెంబర్-1 సిఎం అని బిజెపి సర్ట్ఫికేట్ ఇస్తోందని, ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు.
హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో దేశంలోనే తొలిసారిగా సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ, ఈ-కామర్స్ విధానాన్ని డిజిటలైజేషన్ చేయడం, ఈ-కామర్స్లో కొనుగోలుకు ప్రోత్సాహం తమ లక్ష్యమన్నారు. తెలంగాణ, ఆంధ్ర ఫ్యాప్సీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఈ-కామర్స్పై జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 15: తెలంగాణలో నిర్వహిస్తున్న హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారని, వర్షాలు కురవని సీజన్లో మొక్కలను బతికించేందుకు నీరు ఏవిధంగా అందిస్తారో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సిఎం కె చంద్రశేఖరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరిత హారంపై శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నల్లగొండ, జూలై 15: మావోయిస్టు వ్యతిరేక ఉద్యమకారుడైన నరుూం ముఠా అనుచరులు రౌడిషీటర్ పాశం శ్రీను, భువనగిరి జడ్పీటీసి సందెల సుధాకర్లు శుక్రవారం మధ్యా హ్నాం అనూహ్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎన్. ప్రకాశ్రెడ్డి ఎదుట లొంగిపోయారు. తమ న్యాయవాది చత్రపతితో కలిసి వారు ఎస్పీ వద్ధకు వచ్చి లొంగిపోగా వారిని ఎస్పీ విచారించి అక్కడి నుండి ప్రత్యేక పోలీస్ ఎస్కార్ట్తో వరంగల్ జిల్లా జైలుకు తరలించారు.
సిద్దిపేట, జూలై 15: ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని.. శాసనసభలో తీర్మానం చేయాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఇబ్రహీంపూర్ గ్రామం తెలంగాణ రా ష్ట్రానికి చిహ్నం అని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రత, దోమలు లేని గ్రామాంగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు.
గద్వాల, జూలై 15: నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జోగుళాంబ అమ్మవారి పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ కొన్ని రోజులు గా ఉద్యమాలు చేస్తున్నారు.
దౌల్తాబాద్, జూలై 15: ఒకే గ్రామంలో ఒకే రోజు ఇద్దరి ఆత్మహత్య కలకలం సృష్టించింది. డబ్బుల గొడవ చినికిచినికి గాలివానైంది. దీంతో రెండు కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. పండుగపూట అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.