S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/04/2016 - 07:52

హైదరాబాద్, మే 3: అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కానీ, ఆ ప్రాంత నేతలు కానీ హంద్రినీవా, గాలేరు, వెలిగొండ ప్రాజెక్టులను ఎవరి అనుమతితో కట్టారో సమాధానం చెప్పాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు మంగళవారం డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? వాడుకున్నదెంత? అని ఆయన ప్రశ్నించారు.

05/04/2016 - 07:50

హైదరాబాద్, మే 3: దేశంలో కెల్లా ఎత్తయిన, అతి పెద్ద జాతీయ పతాకాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఘాట్ వద్ద జూన్ 2న ఈ పతాకాన్ని ఎగురవేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు.

05/04/2016 - 05:10

తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళితో రాష్ట్రావతరణ వేడుకలు
ఆరంభం కావాలి. హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 12 ఎకరాల స్థలంలో అమరవీరుల స్మారక స్థూపం నిర్మిద్దాం. అడుగు పెట్టగానే మనసుకు సాంత్వన కలిగేంత ప్రశాంత వాతావరణంలో
స్మృతివనం నిర్మిద్దాం. రెండూ తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. ఈ నిర్మాణాలకు స్థలం కోసం సచివాలయానికి సమీపంలో

05/04/2016 - 05:04

హైదరాబాద్, మే 3: పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచాలని సిఎం కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి అధికారిక లాంఛనాలు పూర్తిచేసి, అవసరమైన అనుమతులు ఇచ్చేశామన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపు అంశాలపై సిఎం కెసిఆర్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ పూర్తయ్యే వరకూ ఎదురు చూడకుండా పంపుహౌస్ ద్వారా నీరు పంపాలన్నారు.

05/04/2016 - 05:00

హైదరాబాద్, మే 3: ఒకవైపు ఎండలు మండుతుండగా, మరోవైపు మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వర్షం జనాన్ని అతలాకుతలం చేశాయి. పిడుగుపాటుకు వివిధ జిల్లాల్లో ఎనిమిది మంది మరణించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుత వేసవి సీజన్‌లో అత్యధిక పగటి ఉష్ణోగ్రత రామగుండంలో 46 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) ప్రకటించింది. దక్షిణ రాష్ట్రాల్లో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు.

05/04/2016 - 04:56

వరంగల్ మే 3: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముప్పనపల్లి అడవుల్లో మంగళవారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిసింది. వారం రోజులుగా ఏటూరునాగారం అడవిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపట్టాయ. మావోలు ఏటూరునాగారం సమీపంలోని ముళ్లకట్ల బ్రిడ్జి దాటుతున్న సమయంలో పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం.

05/04/2016 - 01:27

హైదరాబాద్, మే 3: ఆంధ్రను ఎదుర్కొనేందుకు తెలంగాణ ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని సిఎం కె చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయని, వారి చర్యలను తిప్పి కొట్టేందుకు ఇక్కడి రాజకీయ పార్టీలు, నేతలు ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పిలుపునిచ్చారు.

05/03/2016 - 18:11

హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల చేత దాడులు చేయించడం వల్ల తెలంగాణలో విద్యావ్యవస్థకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎగవేసేందుకే ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందన్నారు.

05/03/2016 - 18:04

హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌లో సిఎం కెసిఆర్‌కు స్వార్థ ప్రయోజనాలున్నాయని టి.కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మంగళవారం ఇక్కడ ఆరోపించారు. మహారాష్టల్రో భూములు ముంపునకు గురికాకుండా ఆ రాష్ట్ర సిఎంతో కెసిఆర్ రహస్య ఒప్పందాలు చేసుకున్నారన్నారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు.

05/03/2016 - 18:03

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటామని ప్రకటనలు చేస్తున్నందున ఎపి సిఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరుల ఇళ్లకు మంచినీరు, పారిశుద్ధ్య సేవలను బంద్ చేయాలని ఓయు విద్యార్థి సంఘనేతలు మంగళవారం విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఉంటూ ఇలాంటి ప్రకటనలు చేయడం ఎపి నేతలకు తగదన్నారు.

Pages