-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
కరీంనగర్: మధ్యప్రదేశ్కు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 230 కిలోల గంజాయిని గోదావరిఖనిలో మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన సభ్యులను అరెస్టు చేశారు. ఈ గంజాయి విలువ సుమారు 11.50 లక్షల రూపాయలని పోలీసులు తెలిపారు. సీలేరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి ఈ ముఠా సభ్యులు మధ్యప్రదేశ్కు తరలిస్తున్నారు.
నల్గొండ: అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా సూర్యాపేటలో మంగళవారం ఎమ్మార్పీఎస్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరువర్గాల కార్యకర్తలు దాడులకు దిగడంతో ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రత్యర్థివర్గం వారు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో విగ్రహాల ఆవిష్కరణను ఈనెల 15కు వాయిదా వేశారు.
హైదరాబాద్: మారిషస్ బ్యాంకులో రుణబకాయిల కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై నాంపల్లి కోర్టు గతంలో జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంట్ను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఎన్బిడబ్ల్యును రద్దు చేయాలంటూ సుజనా చౌదరి వేసిన పిటిషన్ను పరిశీలించాక హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదిలాబాద్: ఓ వ్యక్తి నుంచి ఏడువేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని మందమర్రి మండలం అందుగులపేట విఆర్ఓ భుక్య చందూలాల్ను మంగళవారం ఉదయం పట్టుకున్నారు. ఇతనికి భారీగా అక్రమాస్తులున్నట్లు కూడా ఎసిబి అధికారులు జరిపిన సోదాల్లో వెల్లడైంది.
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరవు, నీటి కొరతపై తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మంగళవారం రాజ్భవన్లో అధికారులతో సమీక్ష జరిపారు. కరవు దృష్ట్యా రైతులకు సహాయం, తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆయన అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు.
నల్గొండ: మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో అంబేద్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాల వద్ద శిలాఫలకాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం టి.టిడిపి నేతలు, కార్యకర్తలు ధర్నా జరిపారు. పార్టీ నేతలు ఎల్.రమణ, రేవంత్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత శేషగిరిరావుపై కోతులు దాడి చేశాయి. ఆయన ఇంటిపైకి వచ్చిన కోతులు ఆయనపై కూడా దాడి చేసి గాయపర్చాయి. గాయపడిన ఆయను కుటుంబీకులు ఎల్వి ప్రసాద్ కంటిఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. నగరంలో కోతుల ఆగడాలను అరికట్టాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 17న మున్సిపల్ కమిషనర్ సోమేష్కుమార్కు ఆయన లేఖ రాశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11: ఉస్మానియా యూనివర్శిటీతో పాటు తెలంగాణ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలు, అనుబంధ, ప్రైవేటు పిజి కళాశాలల్లో 2016-17 విద్యాసంవత్సరానికి 3ఒయుసెట్-20162 నోటిఫికేషన్ను జారీ చేశారు. అభ్యర్ధులు ఈ నెల 13 నుంచి మే 7వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుందని పిజి అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11: తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది విద్యా సౌకర్యాలను పెంచడం, విద్యార్థులను ప్రోత్సహించడం వంటి చర్యలను చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సోమవారం ఆయన వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆన్లైన్లో చేపట్టనున్నట్టు శ్రీహరి తెలిపారు.