S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/30/2016 - 13:47

హైదరాబాద్: కరవు పరిస్థితులపై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వం ఏమీ చేయలేదన్నట్లు జీవన్‌రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు. రైతుల గురించి తెలియని వారు కరవుపై మాట్లాడడం వింతగా ఉందని జీవన్‌రెడ్డి అన్నారు.

03/30/2016 - 13:46

కరీంనగర్: ఇక్కడి బైపాస్ రోడ్డులో బుధవారం ఉదయం ఓ మహిళపై కొందరు ఆగంతకులు ఆకస్మికంగా దాడి చేసి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

03/30/2016 - 12:05

శంషాబాద్: ఔటర్ రింగురోడ్డుపై తోండుపల్లి వద్ద ఔటర్ రింగు రోడ్డుపై బుధవారం ఉదయం ఓ భారీ వాహనం బోల్తాపడి డ్రైవర్ మరణించాడు. వెంటనే పోలీసులు వాహనాన్ని తొలగించి, డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

03/30/2016 - 12:05

రంగారెడ్డి: పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాన్ రంగారెడ్డి మండలం పరిగి వద్ద బుధవారం ఉదయం బోల్తాపడగా అయిదుగురు మరణించారు. 25 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లా ఉత్తరాసుపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

03/30/2016 - 12:03

హైదరాబాద్: అనావృష్టి కారణంగా రైతులు నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వ పరంగా సహాయం అందడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 443 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులుండగా, 231 మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపిందన్నారు.

03/30/2016 - 05:14

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలో విద్యారంగాన్ని అన్ని రకాలుగా పటిష్ఠపరిచి, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అట్టడుగువర్గాలు, పేదలకు సైతం మెరుగైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు.

03/30/2016 - 05:13

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణలో రూ. 35 వేల కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాకరమైన పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. టెండర్ల ప్రక్రియను ఖరారు చేసుకోవచ్చంటూ హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ, మార్గదర్శకాల ఖరారును సవాలు చేస్తూ బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిల్‌ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది.

03/30/2016 - 05:12

హైదరాబాద్, మార్చి 29: హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లయి, సివరేజ్ బోర్డు సర్వీస్‌లోకి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) తెలిపింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన వారి వివరాలను పొందుపర్చినట్లు కమిషన్ కార్యదర్శి పార్వతీ సుబ్రమణియన్ ఒక ప్రకటనలో తెలిపారు.

03/30/2016 - 04:44

హైదరాబాద్, మార్చి 29: శాసన సభ్యుల ప్రోటోకాల్ విషయంలో అధికారులకు స్పష్టత ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించి ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని అధికారులకు లేఖ రాయనున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ‘ప్రోటోకాల్‌పై చాలామంది ఎమ్మెల్యేలకు కూడా తెలియకపోవచ్చు, సీనియర్లకు తెలిసి ఉండవచ్చు.

03/30/2016 - 04:43

హైదరాబాద్, మార్చి 29: పాఠశాల, ఉన్నత విద్యను సంస్కరిస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోగా, విద్యారంగంతో చెలగాటం ఆడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Pages