S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/28/2016 - 18:08

హైదరాబాద్: హెచ్‌సియులో విద్యార్థులపై లాఠీచార్జీ చేయడంలో పోలీసులు అత్యుత్సాహం చూపారని నిరూపణ అయితే దోషులను శిక్షించి తీరుతామని తెరాస ఎంపీ కవిత అన్నారు. హెచ్‌సియులో జరిగిన సంఘటన బాధాకరమే అయినప్పటికీ, ఇలాంటి ఉదంతాల వల్ల హైదరాబాద్ ఇమేజ్‌కి నష్టం జరుగుతోందనడంలో వాస్తవం లేదన్నారు. సామాజిక అంశాలపై ప్రజల మనోభావాలను తెరాస ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.

03/28/2016 - 18:07

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జీ, తాజా పరిణామాలపై రాష్టప్రతికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం దిల్లీకి బయలుదేరింది. మంగళవారం వీరు రాష్టప్రతి కలుస్తారు.

03/28/2016 - 18:06

హైదరాబాద్: సిమ్ కార్డులను విక్రయిస్తున్న తీరుపై పోలీసులు అధికారులు నగరంలో క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. ఎలాంటి విచారణలు లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో సోమవారం నాడు తార్నాక, మేడ్చల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేశారు.

03/28/2016 - 18:06

హైదరాబాద్: గతంలో ప్రకటించిన విధంగానే తెలంగాణలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి వచ్చే నెల 17న రాతపరీక్ష యథాప్రకారం జరుగుతుందని, అయితే ఆర్‌ఆర్‌బి పరీక్షల దృష్ట్యా కానిస్టేబుల్ పోస్టులకు జరిగే రాతపరీక్షను ఏప్రిల్ 3కు బదులు అదే నెల 24న జరుగుతుందని టిపిపిఎస్‌సి అధికారులు సోమవారం ప్రకటించారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని వారు సూచించారు.

03/28/2016 - 16:39

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ అప్పారావు చాంబర్‌పై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన 24 మంది విద్యార్థులకు స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు అధ్యాపకులతో పాటు మరో వ్యక్తికి కూడా ఇదే కేసులో బెయిల్ ఇచ్చారు.

03/28/2016 - 16:38

హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు సోమవారం ఇక్కడ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ రేమాండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల కోసం భూమి లభ్యత గురించి వీరు చర్చించారు

03/28/2016 - 16:38

హైదరాబాద్: తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని యోచించడం తగదని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య సోమవారం అసెంబ్లీ సమావేశంలో అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక సర్కారీ బడులు, ఖరీదైన ఆస్పత్రులు వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులు డీలా పడిపోతున్నాయన్నారు. ఈ పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి విద్య, వైద్యరంగాలను కాపాడాలన్నారు.

03/28/2016 - 16:38

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పిస్తారు. సాయంత్రం జరిగే సభలో చంద్రబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు.

03/28/2016 - 16:37

హైదరాబాద్: పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కాటేసింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాలయ్య అనే వ్యక్తి తన ఇద్దరు మనవరాళ్లు స్నేహ (10), హర్షిత (8)ను స్కూల్ నుంచి బైక్‌పై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. బైక్‌పై నుంచి కిందకు పడిన వెంటనే ఇద్దరు చిన్నారులు మరణించారు.

03/28/2016 - 16:37

హైదరాబాద్: తెలంగాణలో ఇసుక మాఫియాను పూర్తి స్థాయిలో నిరోధించామని, ఇసుక విక్రయాలు పారదర్శకంకా జరుగుతున్నాయని మంత్రి హరీష్‌రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణా విషయమై కాంగ్రెస్ సభ్యులు డికె అరుణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ప్రశ్నించగా, ఆన్‌లైన్ ద్వారా ఇసుక విక్రయాలు ప్రారంభించామని, ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

Pages