-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
సూర్యాపేట, నవంబర్ 25: వరంగల్ పా ర్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి అంగీకరిస్తున్నామని, సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 25: కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లాలోని కృష్ణానదికి బుధవారం భక్తులు పోటెత్తారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. కృష్ణానదీ తీరాన ఉన్న బీచుపల్లి దేవాలయానికి భక్తుల తాకిడి నెలకొంది. శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లో భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
సంగారెడ్డి, నవంబర్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాధించడానికి రాజీలేని పోరాటం చేసిన గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆరాటపడుతూ ఆయుత చండీయాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వేలాది మంది రుత్విక్లతో ఆయుత చండీయాగాన్ని నిర్వహించనున్నారు. యేడాది క్రితమే ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్, నవంబర్ 25: గోదావరి జలాలు శుక్రవారం నగర ప్రవేశం చేయనున్నాయి. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్నుంచి ఇప్పటికే ఘన్పూర్కు చేరుకున్న 28 ఎంజిడిల నీటిని ప్రస్తుతమున్న నీటి సరఫరా వ్యవస్థతో అనుసంధానం చేసే పనులు లింగంపల్లి రిజర్వాయర్ వద్ద ముగింపు దశకు చేరుకున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 25: హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ డిజిపి పేర్వారం రాములు మనవడు సహా ముగ్గురు మృతి చెందారు. ఒకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మరొకరు పేర్వారం అల్లుడికి స్వయానా తమ్ముడి కొడుకు. ఈ దుర్ఘటనతో మాజీ డీజిపి ఇంట్లో విషాదం అలుముకుంది.
హైదరాబాద్, నవంబర్ 25: వరంగల్ విజయం కొత్త చరిత్ర సృష్టించిందని అంటూనే, ఈ విజయం పార్టీ శ్రేణుల్లో గర్వం, అహంకారం పెంచకూడదని సిఎం కె చంద్రశేఖర్ రావు సూచించారు. ప్రజలతో అత్యంత వినయంగా, సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్తోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా ముఖ్య నేతలు బుధవారం సిఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు.
హైదరాబాద్, నవంబర్ 25: వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లడిగేది లేదని తానిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని సిఎం కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రజలు కూడా పథకం కోసం ఎదురు చూస్తున్నారని సిఎం పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్లో రియల్ ఏస్టేట్ బూమ్ పడిపోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదని నిరూపితమైంది. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా కోకాపేట, మణికొండ, రాయదుర్గం ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఎకరం భూమి ధర రూ. 29.28 లక్షలు పలికింది.
నల్గొండ: మల్కాపురంలో టిప్పర్ బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతువాతపడ్డారు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బొమ్మలరామారం మండలం నాయకునితండా వాసులుగా గుర్తించారు.
మహబూబ్నగర్: వడ్డేపల్లి మండలం రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం నుంచి బుధవారం ఉదయం ఒక్కగేటు ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న 2600 క్యూసెక్కుల నీటితో ప్రస్తుతం జలాశంలో గరిష్టస్థాయి నీటిమట్టం నమోదైంది.