S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/14/2018 - 05:42

ఖమ్మం, నవంబర్ 13: అవినీతి పాలనతో ప్రజలను ఇబ్బందులపాలు చేసిన కాంగ్రెస్‌తో జట్టు కట్టడమే కాకుండా, సీట్ల కేటాయింపు విషయంలో జరిగిన అవమానంపై సీపీఐ, కోదండరాం పునరాలోచించి బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానించారు.

11/14/2018 - 01:59

సూర్యాపేట, నవంబర్ 13: వ్యూహ ప్రతివ్యూహాల సమరం. ఉద్ధండుల రణక్షేత్రం. ముందస్తులో మునుపెన్నడూ ఎరుగని ప్రాచుర్యం. దేశ, రాష్ట్ర రాజకీయ విశే్లషకుల దృష్టిని ఆకర్షిసోన్న జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కారు స్పీడెంత..! రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొంటోన్న ఓ ప్రాంతీయ పార్టీ వ్యూహమేమిటీ..!? చివరాఖరి ఫలితమేమైనా..

11/13/2018 - 23:36

కామారెడ్డి, నవంబర్ 13: కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి బంగారు తెలంగాణ చేయమని అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ 300 కోట్ల రూపాయలతో ఇంటిని, మూడు కోట్లతో బాత్‌రూంను కట్టుకుని కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత, కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్‌అలీ ఎద్దేవా చేశారు.

11/13/2018 - 23:29

తిప్పర్తి, నవంబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే రైతులకు రెండు లక్షల రుణమాపీ అమలు చేయడం జరుగుతుందని మాజీ మంత్రి పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

11/13/2018 - 23:28

మిర్యాలగూడ, నవంబర్ 13: రాష్ట్రంలో చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతారని రాష్ట్ర ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక ఏఆర్‌సీ ఫంక్షన్ హాలులో జరిగిన టీఆర్‌ఎస్ మైనార్టీ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో 50 సంవత్సరాలకు పరిపాలన చేసిందని, దేశంలో గాని, రాష్ట్రంలో రిజర్వేషన్ మాట ఎత్తలేదన్నారు.

11/13/2018 - 23:37

గజ్వేల్, నవంబర్ 13: సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజేఎస్, సీపీఐల ఆశలు ఎంతమాత్రం నెరవేరబోవని, అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌కు పహిల్వాన్‌ల రక్షణ ఏర్పాటుతో ఆ పార్టీ ప్రజలను ఎలా కాపాడగలుగుతుందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు నిలదీశారు.

11/13/2018 - 23:26

వరంగల్, నవంబర్ 13: తెలంగాణ జనసమితి కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మిగితా పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంలో కీలకభూమిక పోషించిన కోదండరాం తమ పార్టీకి ఎనిమిది సీట్లు దక్కించుకోవడంలో కూడా అంతే నేర్పును ప్రదర్శించారు. కాని ఆయన ఇక్కడే ప్రస్తుతం కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పార్టీ తరుపున పోటీ చేసేందుకు సరైయిన అభ్యర్థులు లేని విచిత్ర పరిస్థితి పార్టీలో చోటు చేసుకుంది.

11/13/2018 - 16:48

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో టెక్కెట్ల రగడ ఆరంభమైంది. ఖైరతాబాద్ టిక్కెట్టు మనె్న గోవర్థన్‌రెడ్డికి కేటాయించాలని కోరుతూ ఆయన అనుచరులు తెలంగాణ్ భవన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ మేరకు ఓ కార్యకర్త తల పగులగొట్టుకున్నాడు. గోవర్థన్‌రెడ్డి అస్వస్థతకు గురవ్వటంతో ఆసుపత్రికి తరలించారు.

11/13/2018 - 14:01

హైదరాబాద్ నగర శివారులోని కీసర వద్ద ఉన్న ఔటర్ రింగురోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కారు వేగంగా వస్తూ ఎడమ వైపున ఉన్న రెయలింగ్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో భార్యభర్తలతో సహా 11 నెలల వయసు ఉన్న పాప చనిపోయంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

11/13/2018 - 12:34

హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. దీంతో అభ్యర్థుల ప్రకటనలో పార్టీల తలమునకలవుతున్నాయి. సీపీఐ మూడు సీట్లలో పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. ఆ పార్టీకి మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వటంతో సీపీఐ మూడింటికి ఓకే చెప్పింది. ఇక తెలుగుదేశం తొమ్మిది సీట్లలో తన అభ్యర్థులను ప్రకటించింది.

Pages