-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును బోర్డు గురువారం నాడు ప్రకటించింది. మే 14 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకూ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకూ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.
ఫస్టియర్ పరీక్షల షెడ్యూలు
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఓటర్ల జాబితా నుంచి వేల సంఖ్యలో పేర్లు తొలగించడంపై కాంగ్రెస్ నేత లు ఆందోళన వ్యక్తం చేశారు. టి.పిసిసి ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు బి. కమలాకర్ రావు, జి. నిరంజన్, శ్యాం మోహన్, వినోద్రెడ్డి, ప్రేమలత, నరేందర్ రావు, రాజేశ్వర్ శుక్రవారం తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: క్షేత్రస్థాయిలో వాస్తవంగా సాగు చేస్తున్న వారికే పెట్టుబడి సహాయం అందేలా చూడాలని పలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూం భవన్లో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పినందుకు మనస్తాపంతో పలు చోట్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో శ్రీవిద్య (18) చింతల్లోని గాయత్రి కళాశాలలో ఇంటర్ ఎంపిసి తొలి సంవత్సరం చదువుతోంది.
హైదరాబాద్, ఏప్రిల్ 13: రైతుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు కిసాన్, ఖేత్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి అధ్వర్యంలో కొంత మంది నాయకులు, కార్యకర్తలు, రైతులు వెళ్లారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పని చేస్తున్న 40 వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కొంత మంది శుక్రవారం ఆర్.కృష్ణయ్యను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ బి ఆర్ మధుసూధనరావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్ణయించిందని ఆయన చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదల అయినందున ఉపాధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఇంతకాలం సినిమా థియేటర్ల నుంచి వస్తున్న వినోదపుపన్ను వస్తుసేవా పన్ను అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం ఖాతాలోకి మళ్లుతోంది. దీని వల్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు దాదాపు రూ. 100 కోట్ల ఆదాయానికి గండి పడింది. 2017-18 సంవత్సరానికి వినోదపు పన్ను మున్సిపాలిటీల ఖాతాలోకి జమ కాలేదు.
హైదరాబాద్, ఏప్రిల్ 13: వ్యవసాయంలో సర్ట్ఫికెట్ కోర్సులు, ఆన్లైన్ కోర్సులు, సంయుక్త డిగ్రీ ప్రోగ్రామ్లు అందించడం వంటి పలు అంశాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆసక్తి కనబరిచింది. ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఉపకులపతి ప్రవీణ్రావు, రిజిస్ట్రార్ ఎస్.