S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆటాపోటీ
సబ్స్టిట్యూట్ ఆటగాడిగా ఉన్నప్పుడే, నాటి సూపర్ హీరో ఇంజమాముల్ హక్ ట్రిపుల్ సెంచరీ చేయడాన్ని చూసి స్ఫూర్తి పొందిన పాకిస్తాన్ ఓపెనర్ అజర్ అలీ తానే స్వయంగా ఆ ఫీట్ను సాధించే స్థాయికి ఎదగడం విశేషమే. టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎంతో మంది ఉన్నారు. కానీ, డే/నైట్ టెస్టులో మొట్టమొదటి శతకాన్ని నమోదు చేసిన అజర్ అలీ ఆతర్వాత దానిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా మార్చేశాడు.
బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలి. అప్పుడే స్పాట్ ఫిక్సింగ్ వంటి అకృత్యాలకు తెరపడుతుంది. లేకపోతే, ఫిక్సింగ్, బెట్టింగ్ నిరాటంకంగా కొనసాగుతునే ఉంటాయి.
అపారమైన ధన బలంతో ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి చేరిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దూకుడుడు బ్రేక్ పడుతుందా? సుప్రీం కోర్టు ఇవ్వనున్న ఆదేశాలు బోర్డు ఉనికినే దెబ్బతీస్తాయా? భారత క్రికెట్ స్వరూపం పూర్తిగా మారిపోతుందా? లోధా కమిటీ సిఫార్సులతో బిసిసిఐలో సంపూర్ణ ప్రక్షాళనకు పునాదలు పడతాయా? బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమర్పించబోయే అఫిడవిట్ ను సుప్రీం కోర్టు ఏ విధంగా తీసుకుంటుంది?
మంత్రులు ఎవరూ బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదు. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని స్పష్టమైన అర్హతలు ఉండాలి. వీరు భారతీయులై ఉండాలి. వయసు 70 సంవత్సరాలకు మించరాదు. మంత్రిగా లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండకూడదు.
అంతర్జాతీయ ఫుట్బాల్ సమస్య (్ఫఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ ఆఖరి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న అతను క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)లో తుది పోరాటం చేస్తున్నాడు. ఫిఫాకు కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్ఫాంటినో ఎన్నిక చెల్లదని, తనపై విధించిన సస్పెన్షన్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని అతను డిమాండ్ చేస్తున్నాడు.
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని కోర్టుకు ఈడ్చి, ఒక రకంగా లోధా కమిటీ ఏర్పాటుకు కారణమైన ఆదిత్య వర్మ తన లక్ష్యం నెరవేరే వరకూ విశ్రమించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా తప్పించుకోవడానికి బిసిసిఐ వేస్తున్న ఎత్తుగడలపై అతను దృష్టిపెట్టాడు. ఈ విషయంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశాడు.
* చేతికి గ్లోవ్స్ వేసుకోకుండా ఎక్కువ ఫైట్స్లో పాల్గొన్న బాక్సర్ జాన్ సలీవాన్. ఒకసారి అతను పోటీపడిన ఫైట్ 75 రౌండ్ల వరకూ కొనసాగింది. చివరికి విజయం అతనినే వరించింది. 1918 ఫిబ్రవరి 2న గుండె పోటుతో సలీవాన్ మృతి చెందాడు. అది చలికాలం కావడంతో శ్మశాన వాటిలో నేలంతా గట్టిపడిపోయింది. అతని మృత దేహాన్ని ఖననం చేయడానికి నేలను డైనమేట్తో పేల్చాల్సి వచ్చింది.
బాక్సింగ్లో అమెచ్యూర్స్కు, ప్రొఫెషనల్స్కు వేరువేరుగా పోటీలు ఉంటాయి. అమెచ్యూర్స్ తలకు గార్డ్, ఇతర రక్షణ కవచాలతో బౌట్లో పాల్గొంటారు. ప్రొఫెషనల్స్కు ప్రత్యేక కవచాలంటూ ఏవీ ఉండవు. క్రీస్తుపూర్వం 688లో జరిగిన ఒలింపిక్స్లో బాక్సింగ్ ఒక క్రీడగా ఉండేదని చెప్పడానికి ఆధారాలున్నాయి. పురాతన ఒలింపిక్స్లో మొట్టమొదటి బాక్సింగ్ టైటిల్ను అనొమస్టస్ సిర్నయోస్ గెల్చుకున్నాడు.
బాక్సింగ్కు మారుపేరుగా నిలిచిన ‘ది గ్రేటెస్ట్’ మహమ్మద్ అలీకి పట్టుదల ఎక్కువ. అతను చిన్నతనంలో ఒకసారి సుగర్ రే రాబిన్సన్ను చూసేందుకు వెళ్లాడు. అతి కష్టం మీద అతనిని కలుసుకున్నాడు. అయితే, అలీ ఆటోగ్రాఫ్ అడిగితే రాబిన్సన్ నిరాకరించాడు. బాక్సింగ్ ప్రపంచాన్ని జయించాలన్న పట్టుదల అతనిలో అప్పుడే మొలకెత్తింది. అనుకున్నట్టే అసాధారణ బాక్సర్గా ఎదిగాడు.
ఎలుగుబంటిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడతారు. కానీ, మనిషి, ఎలుగుబంటి మధ్య అధికారికంగా బాక్సింగ్ ఫైట్ 1949లో జరిగింది. ఆ ఫైట్లో ఎలుగుబంటి గెలిచింది. ఇలాంటి పోటీ బాక్సింగ్లో కొత్తేమీ కాదు. 1878లో లెనా అనే ఎలుగుబంటితో జీన్ ఫ్రాన్సిస్ బొర్న్ తలపడ్డాడు. అయితే, లెనా పంచ్లకు తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సంఘటన తర్వాత మనిషి, జంతువుల మధ్య బాక్సింగ్ ఫైట్స్ను నిషేధించారు.