S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

10/01/2016 - 21:33

మొహీందర్ అమర్‌నాథ్ 1983లో ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో సభ్యుడు. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్‌ను గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. అతను అత్యంత అరుదైన రికార్డును కూడా తన సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ‘హ్యాండ్లింగ్ ది బాల్’, ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’గా అవుటైన ఏకైక క్రికెటర్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.

10/01/2016 - 21:31

* భారత క్రికెటర్లలో సచిన్ తెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడాడు. ఆతర్వాతి తొమ్మిది స్థానాల్లో రాహుల్ ద్రవిడ్ (163), వివిఎస్ లక్ష్మణ్ (134), అనీల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గవాస్కర్ (125), దిలీప్ వెంగ్‌సర్కార్ (116), సౌరవ్ గంగూలీ (113), హర్భజన్ సింగ్ (103), వీరేందర్ సెవాగ్ (103) ఉన్నారు.
సెంచరీల్లో ‘టాప్-10’

,
09/25/2016 - 23:41

మన దేశంలో క్రీడాకారులు ఎవరైనా రాణిస్తేనే గుర్తింపు లభిస్తుందా? మేజర్ టోర్నీలకు వెళ్లే ముందు ఏమాత్రం పట్టించుకోకపోయినా, పతకాలు సాధిస్తే బ్రహ్మరథం పట్టి, ఆకాశానికి ఎత్తేస్తారా? క్రీడాభివృద్ధిపై చిత్తశుద్ధి కంటే, ఏదో ఒక హడావుడి చేసి, బాధ్యత తీరిపోయినట్టు ప్రభుత్వాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలు భావిస్తున్నాయా?

09/25/2016 - 23:37

రియో ఒలింపిక్స్ అధికారులపై స్విమ్మర్లు మండిపడ్డారు. తెల్లవారు జామునే వచ్చి డోపింగ్ పరీక్షలంటూ గది తలుపులు బాదుతూ హడావుడి చేయడమే వారి కోపానికి కారణం. డోప్ పరీక్షల కోసం అథ్లెట్ల మూత్ర నమూనాలను అధికారులు సేకరించాలి. అయితే, పోటీల్లో పాల్గొని లేదా విరామం లేకుండా ప్రాక్టీస్ చేయడంతో అలసిపోయి గాఢ నిద్ర పోతున్న తమను తెల్లవారు జామునే లేపేస్తున్నారవి స్విమ్మర్లు వాపోయారు.

09/25/2016 - 23:35

భారత క్రీడా మంత్రి విజయ్ గోయల్‌కు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాటించాల్సిన నిబంధనలు కూడా తెలియవా? ఉద్దేశపూర్వకంగానే వాటిని చెల్లుచీటీ ఇచ్చాడా? కనీస అవగాహన కూడా లేకుండానే ఆయన రియో ఒలింపిక్స్‌కు వెళ్లాడా? అందుకే, అక్కడ పొరపాట్లు చేసి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధికారుల ఆగ్రహానికి గురయ్యాడా? ఇవన్నీ నిజాలే. రియోలో గోయల్ హల్‌చల్ చేసిన విధానమే ఇందుకు ఉదాహరణ.

09/25/2016 - 23:34

భారత సైక్లిస్టు డెబోరా హెరాల్డ్ మృత్యుంజయురాలిగా చాలా మందికి తెలుసు. 2004లో ముంచెత్తిన సునామీలో చిక్కుకొని, సుమారు వారం రోజులు ఒక చెట్టును ఆధారంగా చేసుకొని ఆమె బతికిబట్టకట్టింది. కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోగొట్టుకొని ఒంటరిగా మిలిగిన ఆమె సైక్లింగ్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఒకప్పటి సునామీ బాధితురాలు ఇప్పుడు సైక్లింగ్ చాంపియన్‌గా ఎదిగింది.

09/25/2016 - 23:33

రియో డి జెనీరో: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) అధికారుల నిర్లక్ష్యమే రియో పారాలింపిక్స్ పురుషుల ఎఫ్-46 జావెలిన్‌త్రో ఈవెంట్‌లో భారత్‌కు మరో పతకం రాకుండా అడ్డుకుందనే విమర్శలు జోరందుకున్నాయి. ఈ పోటీల్లో దేవేంద్ర ఝజారియా 63.97 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అయితే, ఇదే విభాగంలో పోటీపడాల్సిన సుందర్ సింగ్ గుజ్రార్ గైర్హాజరయ్యాడు.

09/18/2016 - 02:34

అమెరికా, రష్యా దేశాల మధ్య నెలకొన్న క్రీడాస్పర్థ అవాంఛిత రూపాన్ని సంతరించు కుంటున్నది. రష్యా వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిందంటూ అమెరికా నానాయాగీ చేసింది.

09/18/2016 - 02:31

* ‘ఒమో యాక్టివ్ అండ్ స్పోర్ట్స్’ అనే పేరు చూడగానే నార్వే సైక్లిస్టులు అదేదో ఎనర్జీ డ్రింక్ అని భ్రమపడ్డారు. ఓస్లోకు సమీపంలోని రెనాలో ఫ్రెడాగ్స్‌బిర్కెన్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఆరుగురు సభ్యులతో కూడిన నార్వే బృందం వెంటనే ఆ ప్యాకెట్లు తీసుకొని తాగేశారు. కొత్త ఎనర్జీ రాకపోగా, అనారోగ్యంతో ఆసుప్రతి పాలయ్యారు.

09/18/2016 - 02:29

* సైనికులకూ కొద్దోగొప్పో ఆటవిడుపు కావాలనుకున్నారో ఏమోగానీ రష్యా అధికారులు కొత్త ఆటను కనిపెట్టారు. దాని పేరే ట్యాంక్ బయథ్లాన్. ఎగుడుదిగుడు మార్గాలు, పెద్ద గుంటలను దాటుకొని ముందుకు వెళుతూనే, సుమారు ఆరేడు వందల మీటర్ల దూరంలో ఉంచిన లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించడమే ఈ ఆట. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడమేగాక, ఎక్కువ లక్ష్యాలను ఛేదించిన ట్యాంక్‌దే విజయం.

Pages