S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆటాపోటీ
వింబుల్డన్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో అక్కడ పావురాలు రాకుండా చూసేందుకు ప్రత్యేక శిక్షణనిచ్చిన ‘రఫుస్’ అనే డేగ కాపలా కాస్తున్నది. దీనికి ఒక ట్విటర్ అక్కౌంట్ కూడా ఉంది. ట్విటర్ ఫాలోయింగ్లో రఫుస్తో మాగీ మే తీవ్రంగా పోటీపడుతున్నది. మాగీ మే అనేది పక్షికాదు.. ఆండీ ముర్రే పెంచుకుంటున్న కుక్క పేరు ఇది. దీనికి సుమారు 27,000 మంది ఫాలోవర్లు ఉన్నారట.
వింబుల్డన్ కాంప్లెక్స్లో మొత్తం 20 గ్రాస్ కోర్టులు ఉన్నాయి. వాటిలో మొదటి కోర్టులోనే కీలక మ్యాచ్లు జరుగుతాయి. వర్షం పడితే, వెంటనే కోర్టు ఆరేందుకు వీలుగా ఇరువైపులా భారీ ఫ్యాన్లను సిద్ధం చేస్తారు. ఈ కాంప్లెక్స్లో ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ సభ్యుల కోసం ఐదు రెడ్ షేల్ కోర్టులు, నాలుగు క్లే కోర్టులు, ఐదు ఇండోర్ కోర్టులను అందుబాటులో ఉంచుతారు.
నాలుగు గ్రాండ్ శ్లామ్స్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఈనెల 27న ఆరంభం కానుండగా, నిరుడు మూడు టైటిళ్లు సాధించిన భారత్ ఈసారి ఏ విధంగా రాణిస్తుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. జూలై 10వ తేదీ వరకు జరిగే 130వ వింబుల్డన్లో పురుషులు, మహిళల విభాగాల్లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన నొవాక్ జొకోవిచ్, సెరెనా విలియమ్స్ డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగనున్నారు.
* యుజువేంద్ర చాహల్ ఒక్కడే ఈసారి ఐపిఎల్లో రాణించిన స్పిన్నర్. అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. నిరుడు 23 వికెట్లు పడగొట్టిన అతను ఈసారి 21 వికెట్లు సాధించాడు. అతనిని మినహాయిస్తే, భారత జాతీయ జట్టుకు ఎంపికకాని బౌలర్లు ఎవరూ ఇప్పటి వరకూ ఐపిఎల్లో 20కి పైగా వికెట్లను పడగొట్టలేదు. టీమిండియాలో స్థానం కోసం ఎదురుచూస్తున్న చాహల్ రెండుసార్లు 20కి మించి వికెట్లు కూల్చడం విశేషం.
ఈసారి ఐపిఎల్ కెప్టెన్ల టోర్నీగా మారిపోయింది. దాదాపుగా అన్ని జట్ల కెప్టెన్లు ఈ టోర్నీలో అద్భుతంగా రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు సాధించి ఒక రికార్డును, ఒక సీజన్లో అత్యధిక పరుగులను నమోదు చేసి అధిగమించి మరో రికార్డును నెలకొల్పాడు. తొమ్మిదో ఐపిఎల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.
తొమ్మిదో ఐపిఎల్లో బ్యాట్స్మెన్ ఆధిప త్యం స్పష్టంగా కనిపించింది. ఒక వికెట్కు సగటున 28.36 పరుగులు జత కలిశాయి. 2014లో వికెట్కు సగటున 28.18 పరుగులు నమోదయ్యాయి. ఆ రికార్డును తొమ్మిదో ఐపిఎల్ అధిగమించింది. విరాట్ కోహ్లీ 973 పరుగులు సాధించాడు. ఒక సీజన్లో ఒక బ్యాట్స్మన్ సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో అతను అగ్రస్థానాన్ని సంపాదించాడు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) భయం పట్టుకుంది. స్వదేశంలో జరిగే టోర్నీలకేకాదు.. దేశం తరఫున ఆడాల్సిన సిరీస్లకు కూడా గైర్హాజరవుతున్న చాలా మంది క్రికెటర్లు ఐపిఎల్లో పాల్గొనేందుకు పరుగులు తీయడమే బోర్డుల ఆందోళనకు ప్రధాన కారణం. కెరీర్ మొత్తంలో సంపాదించలేనంత మొత్తం ఒకటి రెండు ఐపిఎల్ సీజన్లలోనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
గాయంతో బాధపడుతున్నానని అంటూ ప్రతిష్టాత్మక టి-20 వరల్డ్ కప్లో పాల్గొనడానికి నిరాకరించిన శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపిఎల్లో ఆడేందుకు ఉత్సాహం చూపాడు. ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సిన అతను చివరి వరకూ ఐపిల్లో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, జాతీయ జట్టుకు ఆడేందుకు అడ్డు వచ్చిన ఫిట్నెస్ సమస్య ఇప్పుడు ఏమైందంటూ శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) అధికారులు మలింగను నిలదీశారు.
ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న సంస్థగా ఎదిగి, ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 41 ఏళ్ల అనురాగ్ ఠాకూర్ సంబరపడుతుండవచ్చు. కానీ, అతను సమస్య ఊబిలో కాలుమోపాడు. దాని నుంచి బయటపడతాడా లేక అందులో కూరుకుపోయి, ఏమీ చేయలేని స్థితిలో చిక్కుకుంటాడా అన్నది ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ అతను అధికారంలో ఉంటాడు.
బ్రిస్బేన్, మే 19: టెస్టు మ్యాచ్లు పగలు జరుగుతాయి. వనే్డ, టి-20 ఫార్మెట్లో మ్యాచ్లు కూడా పగలు జరిగినా, ఎక్కువ సంఖ్యలో మ్యాచ్లు డే/నైట్ పోటీలుగానే ఉంటాయి. కానీ టెస్టు క్రికెట్లోనూ డే/నైట్ మ్యాచ్లు రంగ ప్రవేశం చేశాయి. దీనితో ప్రేక్షకుల కోసం ‘ట్వి లైట్’ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.