S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆటాపోటీ
ఆటగాళ్లపై ఒక్కో ఫ్రాంచైజీ పెట్టే మొత్తంపై నిర్వాహకులు సీలింగ్ విధించారు. అత్యధికంగా 66 కోట్ల రూపాయల వరకూ ఫ్రాంచైజీలు వెచ్చించే అవకాశం ఉంది. గతంలో తీసుకొని, వేలానికి విడుదల చేయకుండా తమ వద్దనే ఉంచుకోవాలన్న ఆటగాళ్లకు చెల్లించే ఫీజును ఈ మొత్తం నుంచే మినహాయిస్తారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో ఒక ఏడాది అమల్లో ఉండేలా కాంట్రాక్టు కుదుర్చుకుంటారు.
బంగ్లాదేశ్లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్షిప్లో పాల్గొనడం ద్వారా గుర్తింపు సంపాదించిన ఐదుగురు యువ క్రికెటర్లు ఐపిఎల్ వేలంలో అమ్ముడయ్యారు. ఇషాన్ కిషన్ (గుజరాత్ లయన్స్), మహిపాల్ లొమొర్ (్ఢల్లీ డేర్డెవిల్స్), రిషభ్ పంత్ (్ఢల్లీ డేర్డెవిల్స్), ఖలీల్ అహ్మద్ (్ఢల్లీ డేర్డెవిల్స్), అర్మాన్ జాఫర్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) ఐపిఎల్లో చోటు దక్కించుకున్నారు.
ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీల జాబితాలో ఢిల్లీ డేర్డెవిల్స్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 14 మంది ఆటగాళ్ల కోసం ఆ ఫ్రాంచైజీ 31 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ నలుగురు ఆటగాళ్ల సగటు బేస్ప్రైస్ 4.5 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, డేర్డెవిల్స్ సగటున 6.89 రెట్లు మొత్తాన్ని వెచ్చించింది. కాగా, చాలా పొదుపుగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్.
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (్ఫఫా)పై పట్టు సంపాదించేందుకు పలువురు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులతో పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈనెల 26న జ్యూరిచ్లో జరిగే ఫిఫా ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా, రేసులో ఉన్నవారంతా సమస్యలను గాలికొదిని, స్వలాభాన్ని ఆశిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు.
ఫిలిప్పీన్స్ బాక్సింగ్ సూపర్ స్టార్ మానీ పాక్వియానో ఈ ఏడాది ఏప్రిల్లో రిటైర్ కానున్నాడు. రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించడానికి వీలుగా బాక్సింగ్ కెరీర్ను ముగిస్తానని అతను స్థానిక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఏప్రిల్ 9న తిమోడీ బ్రాడ్లేతో జరిగే ఫైట్ తన కెరీర్లోచివరిదని చెప్పాడు.
బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్పై అధికారులు పన్ను ఎగవేత కేసు పెట్టారు. నేమార్ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అతని తండ్రి నేమార్ సీనియర్పైనా కేసు నమోదైంది. ఇప్పటికే స్పెయిన్లో కేసు ఎదుర్కొంటున్న నేమార్ను తాజా సంఘటన ఆందోళనకు గురి చేస్తున్నది.
ఒక చిన్నారి అభిమానిని కలవడానికి అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. కాబూల్ క్రికెట్ సంఘం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఐదేళ్ల చిన్నారి ముర్తజా అహ్మదీకి మెస్సీ అంటే వల్లమాలిన అభిమానం. అతను ధరించే 10వ నంబర్ గల అర్జెంటీనా జెర్సీ రెప్లికాను కొనే స్థోమత అతని తండ్రికి లేదు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల వనే్డ సిరీస్ టీమిండియాకు ఎన్నో పాఠాలు నేర్పింది. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీపై మరోసారి అనుమానాలకు తెరలేపింది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల జట్లకు నాయకత్వం వహిస్తున్న ధోనీ మధ్య పోలిక మళ్లీ మొదలైంది. ధోనీని తప్పిస్తే, అతని స్థానాన్ని కోహ్లీతో భర్తీ చేస్తారా? లేక ముంబయి ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ అవకాశం లభిస్తుందా?
క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు బ్యాట్స్మెన్, కొన్ని సందర్భాల్లో ఫీల్డర్లు, ముఖ్యంగా వికెట్కీపర్లు, ఫార్వర్డ్ షార్ట్లెగ్లో నిల్చున్నవారు బంతి తగలకుండా హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ, భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కాన్బెరాలో జరిగిన వనే్డలో అంపైర్ జాన్ వార్డ్ హెల్మెట్ ధరించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. అంతకు ముందు మరో ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో కాలికి గాయమైంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఓ పోలీసు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చిక్కుల్లో పడ్డాడు. బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఒక అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లాడు. అక్కడి విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ మెస్సీతో కలిసి ఫొటో తీయించుకోవాలని ఉత్సాహపడ్డాడు.