S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

02/22/2017 - 22:03

పాఠశాలల్లో అధిక మొత్తంలో వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు, పరీక్షల నిర్వహణకు ఒక రెగ్యులేటరీ అథారిటీని నియమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విద్యా రంగంలో అనిశ్చితి నెలకొంది. పాఠశాలలపై నియంత్రణ లేదు. అనేకచోట్ల పాఠశాలల్లో వసతి సదుపాయాలు లేవు. టీచర్లను నియమించినా వారు పాఠశాలలు ఉన్న గ్రామాల్లో ఉండడం లేదు.

02/22/2017 - 22:02

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పాలకుల ప్రకటన కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. 30 ఏళ్లుగా లేని ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఇప్పుడు బాగుంది.. అంటే నమ్మశక్యం కాదు. ప్రభుత్వ పాఠశాలలనే ఎత్తివేయాలనే యోచనలో ఉన్న ప్రభుత్వాలు ప్రస్తుతం పాఠశాలల పనితీరు మెరుగుపడిందని అంటున్నారు. ఇంతకాలం పాఠశాలలపై పర్యవేక్షణ లోపంవల్ల విద్యాప్రమాణాలు తగ్గాయి.

02/22/2017 - 22:01

తెలంగాణ ఉద్యమ కాలంనుంచి విద్యారంగం ఏ విధంగా ఉండాలనే దానిపై ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుగారికి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే కేజీ టూ పీజీ వరకు ఉచిత పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం అమలులో తొలి దశగా ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభంలో ప్రైవేటు భవనాల్లో వీటిని ప్రారంభించినా, ఏడాదిలో సొంత భవనాల నిర్మాణం జరుగుతుంది.

02/22/2017 - 22:00

విద్యారంగం బజారులో అమ్మే సరకులా మారింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వాటిలో కనీస వసతులు లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో తమ వ్యాపారాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క తరగతికి 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండవలసిన గదిలో 50 నుంచి 70 మందిని ఉంచుతూ విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తున్నారు. చాలా విద్యాసంస్థల్లో కనీసం ఆట స్థలాలు కూడా లేవు.

02/22/2017 - 21:54

ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. పేద పిల్లలకు విద్య అందనంత దూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అనేకం కూలిపోయే విధంగా ఉన్నాయి. వాన వస్తే పాఠశాలలకు సెలవు ప్రకటించాల్సి వస్తున్నది. ఎన్నికల ముందు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలపై తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రహం వ్యక్తం చేసింది.

02/15/2017 - 23:17

భారత రాజ్యాంగం సర్వోన్నతమైంది. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల వ్యవస్థ వివాదాస్పదం అయినంతగా మరేదీ కాలేదు. కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ ప్రతినిధిగా పనిచేయాలనేది రాజ్యాంగ స్ఫూర్తి, అయితే కొంతమంది కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తూ రాష్ట్రప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం, ప్రతిపక్ష పార్టీలను అన్యాయంగా బర్త్ఫ్ చేయడం వంటి పరిణామాలతో గవర్నర్ల వ్యవస్థ తీవ్రమైన విమర్శలనే ఎదుర్కొంటోంది.

02/15/2017 - 23:16

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ వ్యక్తులున్నా గవర్నర్లు తమ విచక్షణాధికారాలను కోల్పోరాదు. కేవలం కీలుబొమ్మలా ఉంటే ప్రయోజనం ఏముంటుంది? ప్రజాస్వామ్యానికే అది మచ్చలా కన్పిస్తుంది. గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులనుబట్టి ఎప్పటికప్పుడు రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం కేంద్రం పెట్టిన భిక్ష అనే పద్ధతిలో ఉండరాదు.

02/15/2017 - 23:14

గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహారించాలే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారవద్దు. తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు.

02/15/2017 - 23:13

రాష్ట్రాల్లో స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కీలక బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. శాసనసభలో అనివార్య పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలన్న అంశంపై గవర్నర్ నిర్ణయమే కీలకమవుతుంది. బల నిరూపణకు ముందుకు వచ్చే శాసనసభా పక్ష నేత స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనే అంశాన్ని గవర్నర్ నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.

02/15/2017 - 23:11

భారత రాష్టప్రతికి ప్రతినిధిగా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు చక్కదిద్దేందుకు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం జరుగుతుంది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పెరిగినప్పుడు, అధికారంకోసం గొడవలు వచ్చినప్పుడు గవర్నర్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం గవర్నర్ పదవిలో నియామకం అయ్యేవారు కేంద్రం చెప్పినట్టు నడచుకోవాల్సి వస్తోంది.

Pages